పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/78

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

71


దురితంబులు పరమేశ్వరు
చరితంబులు వినిన జన్మసాఫల్య మగున్.

117


వ.

అని యడిగిన యమ్మునులకు సూతుం డి ట్లనియె.

118

దీపకళికాప్రదానప్రభావము

తే.

అసితసితపక్షములఁ జతుర్దశులయందు
దీపమాలిక లర్పించు ధీరమతులు
మహితసుజ్ఞాను లగుచు సామ్రాజ్యపదముఁ
జెందియుందురు శ్రీసాంబశివునికృపను.

119


వ.

ఇందులకు వక్తృశ్రోతృమనోరంజనం బయినయొక్కయితి
హాసంబు గలదు దానిం జెప్పెద నాకర్ణింపుం డని సూతుం
డమ్మునుల కి ట్లనియె.

120

దాశరాజుచరిత్రము

తే.

జనమనోహర మగుచు నిషాద మనఁగ
నొక్కదేశంబు మహితమై యొప్పుచుండుఁ
దద్విషయ మేలుచుండును దాశరాజ
నామధేయంబు గల్గిన నరవరుండు.

121


తే.

ఆనిషాదాధినాథుండు హర్ష మెసఁగ
హరిణనయన కుముద్వతి యనఁగఁ బరఁగు
రాజకన్యక వరియించి తేజ మలర
లీల నిజదేశ మెలమిఁ బాలింపుచుండె.

122


శా.

ఆదాశక్షితిపాలుఁ డెంతయును భక్ష్యాభక్ష్యలోలుండు మ
ర్యాదాతీతపథప్రవర్తనుఁడు శిష్టాచారహీనుండు స