పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/73

ఈ పుట ఆమోదించబడ్డది

66

బ్రహ్మోత్తరఖండము


క.

దాని విని పౌరులందఱు
నానిశి యేతెంచి వత్స మారసి తథ్యం
బౌ నని తలఁచుచు విస్మిత
మానసులై మరలఁ జనిరి మందిరములకున్.

98


వ.

ఇవ్విధంబున నాకాంత గొంతకాలం బాశూద్రనాయకుం
గూడి యథేచ్ఛావిహారంబుల వర్తించి కాలవశంబునఁ
గృతాంతుపురంబునకుం జనిన సమవర్తియు దానిదుష్కృతం
బులు చిత్రగుప్తువలన నెఱింగి దుర్గతిఁ ద్రోయించిన నదియును
కాలసూత్రాసిపత్రదారుయంత్రతప్తపాషాణశూలారోహణ
వైతరణీకుంభీపాకమహారౌరవాదిఘోరనరకంబు లనుభవించి
దండధరుశాసనంబునఁ గ్రమ్మర మర్త్యలోకంబునందుఁ జం
డాలయోనిం బుట్టి జాత్యంధయుఁ గుష్ఠరుజాక్రాంతయుఁ
గ్రిమిసంకులవ్రణయును బంధువిహీనయు క్షుత్పిపాసాతు
రయు నుచ్ఛిష్టాన్నభోక్త్రియునై భిక్షాటనంబు సేయుచు
సంచరింపుచుండె నని యా చండాలి పూర్వజన్మవృత్తాం
తంబుఁ జెప్పిన విని యాశ్చర్యంబు నొంది యాశివకింకరులం
జూచి యే నిట్లంటి.

99


క.

ఏయేకర్మంబులచే
నీయింతికి సంభవించె నీదురవస్థల్
యేయనువున నిమ్మాలకు
శ్రీయుత మగుశివపదంబుఁ జేరం గలిగెన్?

100


వ.

అని యడిగిన నమ్మహాత్ము లిట్లనిరి.

101


సీ.

అన్నదానవిహీన యైనదోషంబున
          క్షుత్పిపాసార్తయై స్రుక్కుచుండె