పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/62

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

55


వలసిన నాగోకర్ణ
స్థలమున బ్రహ్మాండభాండతనువు వెలుంగున్.

45


మ.

అవనీపీఠము వారివాహకలశం బాకాశలింగంబు కై
రవబంధుప్రసవం బినేందుశిఖినేత్రంబుల్ త్రయీవక్త్ర మ
ర్ణవతుందంబు కుభృద్భుజాయుగ మజాండస్వచ్ఛదేహం బధో
భువనాంఘ్రు ల్దనరన్ మహాబలుఁడు దాఁ బొల్పొందు విశ్వాకృతిన్.

46


వ.

మఱియు నమ్మహాబలదేవుమందిరంబునకు బ్రహ్మేంద్రో
పేంద్రులును, వసురుద్రాదిత్యవిశ్వదేవమరుద్గణంబులును,
జంద్రసూర్యాదిగ్రహంబులును, విమానారూఢులయి పూర్వ
ద్వారంబున వసియించియుందురు. మృత్యుచిత్రగుప్తపావ
కశమనసవితృప్రముఖులు దక్షిణద్వారంబున సేవింపుచుందురు.
వరుణుండు గంగాదిమహానదులు వాసును బశ్చిమద్వారం
బున భజనంబు సేయుచుందురు. భద్రకర్ణియును సప్తమాతృ
కలును జండికాదిదేవతలును నుత్తరద్వారంబునఁ గొలిచి
యుందురు. విశ్వావసుచిత్రరథాదిగంధర్వులు గానంబుసేయు
చుందురు. రంభోర్వశీమేనకాతిలోత్తమాద్యప్సరసలు
నమ్మహాదేవునిసాన్నిధ్యంబున నర్తనంబులు సలుపుచుందురు.
వసిష్ఠకశ్యపకణ్వవిశ్వామిత్రదక్షాత్రిభరద్వాజజైమినీజాబాలి
మరీచ్యంగీరసనారదసనకసనందనాదిమహామునీంద్రులు తదు
పరిభాగంబున ధ్యానంబు గావింపుచుందురు. యతిబ్రహ్మ
చారిస్నాతకవ్రతిజటావల్కలాంబరధారులును యోగు
లును ద్వగస్థిమాత్రశరీరులైన తాపసులును నాచంద్రశేఖరు
నారాధింపుచుందురు. దేవగంధర్వకిన్నరకింపురుషచారణ