పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/60

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

53


క.

గోమేధము లొనరించితి
గ్రామంబులతో రథాశ్వకరివరముక్తా
దామాదికదానంబులు
భూమిసురోత్తముల కొసఁగి పుణ్యుఁడ నైతిన్.

35


ఉ.

చేసితి దానధర్మములు చేసితిఁ దీర్థజలావగాహముల్
చేసితి సువ్రతంబులును జేసితి భూరితరాశ్వమేధముల్
చేసితి దేవపూజలును జేసితి నైన మునీంద్ర తొల్లి నేఁ
జేసిన ఘోరపాపము నశింపకయున్నది యేమి చెప్పుదున్.

36


వ.

అదియునుం గాక యఘాపహరంబులైన ప్రాయశ్చిత్తంబు
లనేకంబు లొనరించితి నైన నిమ్మహాదుష్కృతంబునకు
నిష్కృతి గలుగనేరకున్న యది మహాత్మా కారుణ్యసము
ద్రుండవగు నీప్రసాదంబునం జేసి కృతార్థుండ నగుదు. నీ
బ్రహ్మహత్యాపిశాచంబు పరులకు నగోచరం బై మదీయ
దృష్టిపథంబునం బడి భర్జింపుచు వెనువెంట నంటియున్న
యది విపత్సముద్రంబున మునింగియున్న నన్నుం గడతేర్ప
నావయుంబోలె భవత్సందర్శనంబు సిద్ధించె. నిప్పిశాచంబు
దొలంగునట్లుగా ననుగ్రహింపవలయు నని ప్రార్థించిన
యారాజుం గటాక్షవీక్షణంబుల నిరీక్షించి యగ్గౌతమ
మహామునీంద్రుం డిట్లనియె.

37


క.

ఓకాకుత్స్థకులేశ్వర
సాకేతపురాదినాథ చయ్యన నీ వీ
శోకంబు మాని యిప్పుడు
గోకర్ణస్థలికిఁ జనుము కుశలము గలుగున్.

38


వ.

అది యెట్టిదంటేని.

39