పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/58

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

51


నంత నాభూకాంతుండు ద్వాదశాబ్దంబులు నిండిన రాక్షస
భావంబుఁ బరిత్యజించి క్రమ్మర మానుషత్వంబు వహించి
నిజపురంబునకు వచ్చి గురుజనానుజ్ఞాతుండై రాజ్యంబు
సేయుచుండె నాసమయంబున.

24


క.

సురతేచ్ఛ నవ్విభుఁడు నిజ
తరుణిన్ రాఁబనుప నది యుదగ్రం బగు భూ
సురవనితాశాపస్థితి
నెఱిఁగి నివారింప నుండె నింతులగోష్ఠిన్.

25


ఆ.

అట్టు లగుటఁజేసి యారాజుననుమతి
శిష్టుఁ డైన యవ్వసిష్ఠమౌని
యతనిధర్మపత్నియం దశ్మకుండను
సుతుని గలుగఁ జేసె శుభము లలర.

26


శా.

ఆభీలద్విజభామినీప్రకటశాపాప్తి న్సతి న్బాసి తా
"కో భోగో రమణీం వినా" యనెడుప ల్కూహించి నిస్సంగుఁడై
యాభూమీశుఁ డనన్యభుక్తమగురాజ్యంబు న్విసర్జించి పౌ
ర్యాభ్యాసత్వము జెంది భూమి దిరుగన్ యాదృచ్ఛకుండై చనెన్.

27


మ.

సకలోర్వీతలనాయకుండు ధరణీసంచారముం జేయుచోఁ
బ్రకటాభీలకరాళదంష్ట్రలును దుర్గంధాంగదుష్కేశముల్
వికటభ్రూకుటిఫాలముం దనరఁగా వెన్వెంట నేతెంచు కౌ
శికదుస్తారక నొక్కభీకరపిశాచిం గాంచె మార్గంబునన్.

28


ఆ.

అట్టి దుష్పిశాచ మారాజు చేసిన
బ్రహ్మహత్య యనెడు పాతకంబు