పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/57

ఈ పుట ఆమోదించబడ్డది

50

బ్రహ్మోత్తరఖండము


వ.

అంత.

20


సీ.

గురుశాపమునఁ జేసి ఘోరరూపముఁ దాల్చి
          క్రూరుఁడై నిజరాజ్యదూరుఁ డగుచుఁ
గలుషభావముఁ జెంది కల్మాషపాదుండు
          గహనంబుఁ జేరి నిష్కరుణుఁ డగుచు
మృగపక్షిపశువులాదిగ జంతువులఁ బట్టి
          సమయించి వానిమాంసమును దినుచుఁ
గాలంబుఁ గడుపుచుఁ గఠినత్వమున నుండి
          యొకనాఁడు క్షుత్తుచే నోర్వలేక


తే.

యశన మొక్కింత నేమియు నమరకున్న
నొక్కచో విప్రమిథునంబు నొప్పఁ గాంచి
యడ్డముగ వచ్చి తత్సతి యఱచుచుండఁ
గినుక నాద్విజుఁ బట్టి భక్షించె నపుడు.

21


క.

తదనంతరమునఁ దత్సతి
మదయంతీరమణు దనుజమానవనాథున్
మదమత్తుని గనుఁగొని తా
నదయత శోకాభితప్తయై యిట్లనియెన్.

22


పంచచామరము.

తపస్సమాధిఁ జెందియున్న తాపసేంద్రు మత్పతిం
గృపావిహీనబుద్ధిఁ బట్టి మ్రింగి తీవు గావునన్
నృపాధమా భవత్సతిం బరిగ్రహించునంతటన్
వ్య పేతజీవితుండ వౌదు వంచు నిచ్చె శాపమున్.

23


వ.

ఇట్లు కల్మాషపాదునకు భూసురాంగన శాపం బిచ్చి పతి
శల్యంబులతోడన హుతాశనదగ్ధయై దివంబునకుఁ జనియె