పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

40

బ్రహ్మోత్తరఖండము


గంతుద్వేషిని మదిలోఁ
జింతింపుచు నిష్ఠ జపము సేయుచునుండెన్.

96


వ.

తదనంతరంబ.

97


శా.

శ్రీకంఠుం గిరిజాసమేతు మదిలోఁ జింతింపుచు న్నిష్ఠతో
భూకాంతుండు జపింపఁగాఁ దనుసముద్భూతంబులై వాయసా
నీకంబుల్ శతకోటిసంఖ్య వెడలె న్నిర్దగ్ధపక్షంబులై
కాకారావము జేయుచుం బడియె నక్కాళిందిమధ్యంబునన్.

98


తే.

ఈమహాశ్చర్య మంతయు నేర్పడంగఁ
జూచి యాదవవీరుండు చోద్యమంది
తమకులాచార్యునకు వందనములు సేసి
విస్మయంబుగ నీవార్త విన్నవించె.

99


క.

నావిని మునివరుఁ డి ట్లను
భూవల్లభుఁ జూచి నీదు పూర్వభవకృతం
బై వెలయుఁ గలుషసముదయ
మీవాయసతతి యదగుచు నిట్టుల వెడలెన్.

100


క.

పంచాక్షరమంత్రంబు జ
పించిన మాత్రమునఁ బాపబృందము లణఁగు
న్నించుక యనలము సోఁక ను
దంచితమగుతూలరాశి దగ్ధము కాదే.

101


వ.

అట్లు కావున సదాశివానుగ్రహంబున నిమ్మహామంత్ర
రాజంబు ప్రాప్తం బయ్యె దానం జేసి నీవు ధర్మశీలుండవైతివి
గావున నీ వింక భవద్దేవీసహితంబుగా సమ్మదంబున సుఖం
బుండుదువు భవద్వంశంబున భగవంతుం డైన శ్రీవిష్ణుండు