పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

39


వ.

అని యడిగిన నమ్మునీంద్రునితోఁ గళావతి యిట్లనియె మహాత్మా
యిమ్మహీపాలుండు ప్రాకృతపురుషుండును సదాచారవర్జి
తుండు నయియుండుఁ గావున మీర లిప్పు డీనృపాలునకుం
గటాక్షించి భోగమోక్షప్రదంబును నిహపరసాధకంబును
బరమపవిత్రంబును మంత్రరాజంబు నయినశైవపంచాక్షరం
బుపదేశింపవలయు నట్లయిన నితండు కృతార్థుం డగు నాగామి
సంచితప్రారబ్ధంబు లయినదుష్కర్మంబులుం దొలంగి సకల
శుభంబులుం బ్రాపించునట్లుగాఁ బ్రసాదింపవలయునని విన్న
వించిన నమ్మానిని మృదుమధురభాషణంబుల కలరుచు నట్ల
సేయుదునని సమ్మతించిన.

94


సీ.

ఆరాజమిథునంబు నమ్మెయిఁ దోడరా
          యమునానదీసమీపమున కేఁగి
వనజాక్షి తత్తీరమున నుండ నియమించి
          భూపాలు సంకల్పపూర్వకముగ
నఘమర్షణస్నాన మాచరింపఁగఁజేసి
          లలితవిభూతి ఫాలమున నలఁది
సిద్ధాసనస్థుగాఁ జేయుచు నిజపాద
          తలమున నతనిహస్తముల నునిచి


తే.

మౌనివర్యుండు విధ్యుక్తమార్గమునను
హస్తమస్తకసంయోగ మాచరించి
శైవపంచాక్షరోపదేశం బొనర్చెఁ
గరుణ వెలయంగ దాశార్హధరణిపతికి.

95


క.

అంతట నజ్జనపతి యే
కాంతమతిం దేవదేవు గజచర్మధరుం