పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/43

ఈ పుట ఆమోదించబడ్డది

36

బ్రహ్మోత్తరఖండము


తే.

నిర్మలసువర్ణరత్నమాణిక్యఖచిత
భూషణంబులు దాల్చి సంతోష మొదవ
వచ్చి నిలుచుండి జీవితేశ్వరునిమ్రోల
నాకలావతి దన్మనోహరతఁ దనరి.

76


తే.

ఇట్లు తనమ్రోల నిలిచినయింతిఁ జూచి
సంగమాసక్తిఁ బిలిచె నజ్జనవిభుండు
పలుదెఱంగులఁ బిలిచినఁ బలుకకున్న
నువిదఁ జెయివట్టి తిగువ నుద్యుక్తుఁ డయ్యె.

77


వ.

అప్పు డాకళావతి పతిసంభ్రమం బెఱింగి యిట్లనియె.

78


శా.

ఓరాజన్యకుమార చాలు నిఁక నోహో రాకు నన్నంటఁగా
వారస్త్రీకులటాదికామినులతో వర్తింపుచు న్నిర్మలా
చారం బేమియు లేక నీవు మధుమాంసద్రవ్యలోలుండవై
ధీరోదాత్తునిభంగిఁ జీఱెదవు భ్రాంతిం జెంద నీకేటికిన్.

79


చ.

వ్రతములఁ జేయునింతి యుపవాసము లున్నవధూటి గర్భిణీ
సతియు సుదీర్ఘరోగిణియు సంగమయోగ్యులు గారు శంకర
వ్రతజపమంత్రతంత్రముల వన్నియకెక్కినదానఁ గాన నే
నతిపరిశుద్ధురాల నను నంటఁగ శక్యమె యంచుఁ బల్కఁగన్.

80


శా.

జాయారత్నముపల్కుఁ గైకొనక హస్తస్పర్శముం జేయఁ ద
ప్తాయఃపిండసమాన మైనసతిగాత్రంబు న్విలోకించి చిం
తాయత్తం బగుమానసంబున భయోత్కంపంబు సంధిల్లఁగా
నాయుర్వీశ్వరుఁ డాకళావతి విమోహభ్రాంతుఁడై యిట్లనున్.

81


తే.

ఇంతి నీమేను గ్రాఁగిన యినుపముద్ద
కరణి నుండుట కిది యేమి కారణంబు