పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/356

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

349


తే.

చిత్తముల భక్తి వెలయ బ్రహ్మోత్తరాఖ్య
ఖండ మాంధ్రప్రబంధంబుగా ఘటించి
యెలమి నంబాపురము పార్థివేశ్వరునకు
భాసురముగ సమర్పణ చేసి రపుడు.

349


శా.

శ్రీనారాయణుఁ డార్తరక్షకుఁడు రాజీవాయతాక్షుండు వి
జ్ఞానానందమయస్వరూపుఁ డగుకృష్ణస్వామి రక్షించు న
క్షీణప్రజ్ఞుల సుబ్బనార్యుసుతులన్ శ్రీజ్యోతిరామన్న ల
క్ష్మీనారాయణుల న్వదాన్యమణియౌ చెంగల్వరాయాగ్రణిన్.

350


బ్రహ్మోత్తరఖండము సంపూర్ణము