పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/352

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

345


మ.

అనుచు న్వేఁడిన సత్కృపాకలితయై యాదేవియుం దుంబురుం
డనుగంధర్వుని జేరి నీ విపుడు వింధ్యారణ్యముం జేరి యా
వనమం దొక్కపిశాచరూపుఁ డగుచు న్వర్తించువిప్రుండు త
ద్ఘనపాపంబు లడంగ శంకరకథాగానంబు గావింపుమా.

317


ఆ.

అటుల నాచరించి యతని ముక్తునిఁ జేసి
యిటకుఁ దోడితెమ్ము హితము వెలయ
ననుచు నాజ్ఞ యొసఁగ నాతుంబురుండును
జనియె నపుడు వింధ్యశైలమునకు.

318


క.

నారదసఖుఁ డగు తుంబురుఁ
డారణ్యస్థలిఁ జరించునట్టిదురాత్మున్
ఘోరపిశాచశరీరు న
వారితనాదంబు గలుగువానిం గాంచెన్.

319


ఆ.

విపులరక్తనేత్రు వికటాట్టహాసునిఁ
బాశబద్ధుఁ జేసి పట్టి తెచ్చి
యొక్కచోట నునిచి ముక్కంటికథలు వీ
ణారవమున గాన మాచరించె.

320


శా.

ఆపైశాచికదేహుఁ డీశుకథ లట్లాలించి నిర్ధూతదు
ష్పాపవ్యూహకుఁడై పిశాచతనువు న్వర్జించి దివ్యస్ఫుర
ద్రూపంబుం ధరియించి ముక్తుఁ డగుచున్ రుద్రాక్షమాలాధరుం
డై పంచాక్షరమంత్రపూతహృదయుండై చెందెఁ గైవల్యమున్.

321


క.

ఆపతితుఁడు మును పశ్చా
త్తాపంబు వహించెఁ గానఁ దత్సుకృతమునం