పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/351

ఈ పుట ఆమోదించబడ్డది

344

బ్రహ్మోత్తరఖండము


సేవింపఁ బరమేశ్వరలోకంబునకుం జని యచ్చట భవానీ
శంకరులకు సాష్టాంగదండప్రణామంబు లాచరించి గౌరీ
సమ్ముఖంబున సుఖంబుండి యొక్కసమయంబున నయ్యింతి
భవానికిం బ్రణమిల్లి యి ట్లనియె.

313


తే.

తల్లి మామకభర్త భూతలమునందు
సకలదుష్కర్మములు చేసి చనియె నట్టి
బాడబుం డిప్పు డెచట నున్నాఁడొ తెలియ
నానతిమ్మని వేఁడిన నగజ పలికె.

314


మ.

హరిణీలోచన నీవిభుం డిపుడు వింధ్యారణ్యభూమి న్భయం
కరపైశాచికరూపుఁడై పథికులం గాఱింపుచున్నాఁడు ము
న్నరకావాసముఁ జేరి కింకరవితానక్రూరశూలాహతిన్
బరితాపంబును జెందియుండెనని చెప్పన్‌ దుఃఖితస్వాంత యై.

315


సీ.

కారుణ్య ముదయింపఁ గాంతాశిరోమణి
       గిరితనూజకు నమస్కృతి యొనర్చి
శాంకరీదేవి యస్మద్విభుం డట్లుండ
       నే నిట్టు లుండుట నీతి యగునె
యేయుపాయంబున నీదుస్స్వభావుండు
       పైశాచరూపంబుఁ బరిహరించు
నావిధం బెఱిఁగింపు మనవుడుఁ గ్రమ్మఱ
       నగరాజతనయ యిట్లనుచుఁ బలికెఁ


ఆ.

జెలువ నీమగండు శివకథాశ్రవణంబుఁ
జేసెనేని పిదపఁ జెందు ముక్తి
యనిన నవ్వధూటి యది యెట్లు సమకూఱు
దేవి నీవ యానతీయవలయు.

316