పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/350

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

343


క.

పాపచయంబులు పశ్చా
త్తాపంబున శుద్ధిఁ బొందుఁ దద్దయు నుచిత
వ్యాపార మార్యసేవ యు
మాపతిభజనంబు ముక్తిమార్గము లరయన్.

309


క.

అవిరతముగఁ బుణ్యకథా
శ్రవణం బొనరింపు మార్యసాంగత్యమునన్
శివదేవుని భజియింపుము
ప్రవిమలకైవల్య మొదవుఁ బాపము లణఁగున్.

310


తే.

శంకరధ్యాననామసంస్మరణములును
దత్కథాకర్ణనములు సంతత మొనర్ప
సమయు నఘములు దొల్లి యజామిళుండు
నామము వచించి కాదె ధన్యాత్ముఁడయ్యె.

311


మ.

వనితా నీవు పురాణము ల్విను మనోవాక్కాయకర్మంబులం
దును గావించినపాపము ల్సమయుఁ జెందు న్సత్క్రియాసిద్ధి పు
ణ్యనదీస్నానఫలంబు లబ్బు శివలోకావాప్తి చేకూఱెడున్
ఘనవిజ్ఞానవిశిష్టమార్గ మొదవుం గల్గుం జతుర్వర్గమున్.

312


వ.

అని హితోపదేశం బొనరించిన యమ్మహీసురోత్తముని
పాదంబులకు సద్భక్తిపూర్వకంబుగా వందనంబులు గావించి
తదీయాజ్ఞాప్రకారంబున నప్పుణ్యక్షేత్రంబునందు నిత్యం
బును తీర్థంబులం గ్రుంకుచుఁ బరమేశ్వరధ్యానం బొనరిం
పుచుఁ బురాణకథాశ్రవణంబు సేయుచు నిర్ధూతకల్మషయై
యావిప్రభామిని కొన్నిదినంబులకుఁ బంచత్వంబు నొంది
దివ్యశరీరంబుఁ దాల్చి విమానారూఢయై సిద్ధగంధర్వులు