పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/347

ఈ పుట ఆమోదించబడ్డది

340

బ్రహ్మోత్తరఖండము


పరిపూర్ణగాత్రి నగుటను
జరియింతు యథేష్టగతుల జారులతోడన్.

297


వ.

అని పలుకుచున్ననిజపత్నివాక్యంబు లాకర్ణించి సంతప్త
హృదయుండై యాబ్రాహ్మణుఁడు భీతచిత్తుండుమ గంపితశరీ
రుండు నయి పరస్త్రీగమనంబున మహాపాతకం బగునని
పలుకఁబడినశాస్త్రంబు మనంబునం దలంచి యల్పసుఖంబున
కయి దుర్గతిం బ్రవేశింపవలసె స్మరవిహ్వలంబును మహా
పాపకారణంబు నయినమదీయశరీరంబు వ్యర్థంబు ప్రాణావ
సానకాలంబున భయంకరు లయిన కాలకింకరులం గాంచి
యేవిధంబున ధైర్యం బవలంబించి యుండుదు నేరీతి
సంతప్తక్షారకర్దమాదిఘోరనరకంబులబాధ లనుభవింతుఁ
గ్రమ్మఱ ననేకకోటిజన్మంబులఁ గ్రిమికీటకాదియోనులం
బుట్టి నిరంతరదుఃఖపీడితుండ నయి యె ట్లుండనేర్తు నా
మనంబు వేశ్యాజనసంగమం బపేక్షించియుండుఁ గాని నిజ
భార్యాగమనం బభిలషింపకున్నయది యే నేమి సేయుదు
భృగుపాతనశూలాధిరోహణాదిబాధలకన్నఁ గోటిగుణితం
బైనసంతాపంబు సమకూరె హాదైవమా పంచశరసాయకా
పాతంబుల నిశీధినిసమయంబు లెట్లు గడపుదు నని వగచు
చున్నభర్తృవచనంబు లాకర్ణించి నిర్భయం బయినచిత్తం
బున నిజవల్లభునకు నాబ్రాహ్మణి యి ట్లనియె.

298


శా.

వారస్త్రీరతి నీవు రేయిపవలు న్వర్తింపఁగాఁ జూచి నే
ధీరుండైన మహీసురేంద్రు ననురక్తిం గూడి భోగించితిన్
దారుణ్యస్థితి నుండుకాంతలకు రత్యాసక్తి లేకుండునే
మేర ల్గా విటు కోపము ల్నెరప నామీఁదన్ ద్విజన్మాగ్రణీ.

299