పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/346

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

339


ఆ.

ఆద్విజాధముఁడు నిజాంగన వర్జించి
నిరత మరిగి వేశ్యనిలయమునకు
మదనశరవిభిన్నహృదయుఁడై దానితో
సంతతంబుఁ గ్రీడ సలుపుచుండు.

292


చ.

అతనివధూటి వంజుల సమంచితరూపవిలాసవిభ్రమా
న్విత నవయౌవనాగమవివేకవివర్జిత యై స్మరాంబకా
హతి బెగడొంది కుందుచు నహర్నిశము న్సుకుమారజారసం
గతి విహరింపుచుండె బహుకామకళాకలనైకచాతురిన్.

293


తే.

ఇట్లు జారునితోడుత నింపుమీఱ
సంగమక్రీడ నుండు నాసమయమునను
వచ్చి తద్భర్త యొకనాఁ డవార్యవృత్తిఁ
బల్లవాధరహృదయంబు జల్లుమనఁగ.

294


క.

జారుఁడు కంపము నొందుచు
నారేయి పలాయమానుఁడై యేగినచో
నారమణి నప్పుడు బలా
త్కారంబునఁ గొప్పుఁ బట్టి ధరఁ బడ నీడ్చెన్.

295


తే.

ఇవ్విధంబునఁ బడఁద్రోచి యింతిఁ బట్టి
జానుకూర్పురచరణహస్తప్రహార
ములను మర్దింపుచుండ నమ్ముదిత భీతి
యడరఁ దనభర్తఁ జూచి యిట్లనుచుఁ బలికె.

296


క.

ధరణీసురవర నీతో
సురతసుఖం బెన్నఁడెఱుఁగ సుస్నిగ్ధవయః