పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/344

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

337


ఆ.

పవ్వళించి వినిన పాపపుమనుజుండు
కొండచిలువ యగుచు నుండు ధరణి
వక్తృసమత వెలయ వచియించినఖలుండు
గాంచు గురుకళత్రగమనఫలము.

285


క.

పౌరాణికు నిందించిన
క్రూరాత్ముఁడు రౌరవాదిగురునరకములన్
ధారుణి బాధలఁ బొందుచు
ధారుణిపై శ్వానయోనిఁ దగ జనియించున్.

286


చ.

ఘనపురజిత్కథాశ్రవణకాలమునందు దురుక్తులాడున
మ్మనుజుఁడు గర్దభంబగు క్రమంబునఁ దాఁ గృకలాసదేహియై
జననము నొందుఁ గ్రమ్మరను శంకరసంహిత లాలకింప కీ
సునఁ జనినట్టివాఁడు వనసూకరమై ప్రభవించు ధారుణిన్.

287


పంచచామరము.

పురాణపుణ్యసత్కథానుభూతికార్యమంతయున్
విరోధవృత్తి సాగనీక విఘ్న మాచరించు న
న్నరాధము ల్యమాలయంబున న్వసించి క్రమ్మఱన్
గతాసులై జనించుచుంద్రు గ్రామసూకరాకృతిన్.

288


సీ.

చిత్తంబు రంజిల్ల శివకథ ల్వినువారిఁ
       బ్రాపించు ధ్రువమైన బ్రహ్మపదము
శ్రవణం బొనర్పక సంతోష మందిన
       నరులైనఁ గాంతురు పరమపదము
పౌరాణికునకుఁ గంబళవస్త్రశయ్య ల
       ర్పించిన ఘను లుండ్రు త్రిదివమునను