పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/341

ఈ పుట ఆమోదించబడ్డది

334

బ్రహ్మోత్తరఖండము


బరాశరాదిమహర్షులు తమతమ యాశ్రమములకుఁ జనిరి
కాశ్మీరనాథుం డగుభద్రసేనభూపాలుండు శ్రీరుద్రాధ్యాయ
ప్రభావంబున నిర్ధూతకల్మషుండై నిజపుత్త్రసమేతముగా
రాజ్యభోగము లనుభవింపుచు సుఖమున నుండె నని చెప్పిన
శౌనకాదిమహామునులు పరమహర్షరసావేశపులకీకృతశరీరులై
సూతుం బ్రశంసించి యి ట్లనిరి.

269


క.

భూతేశభక్తిపరులకు
ఖ్యాతిగఁ గైవల్య మొదవు నజ్ఞానమహా
పాతకసింధునిమగ్నుల
కేతెఱఁగున ముక్తి గలుగు నెఱిఁగింపఁగదే.

270

పురాణశ్రవణమాహాత్మ్యము

వ.

అని యడిగిన నమ్మహామునీంద్రులకు సూతుం డి ట్లనియె.

271


ఆ.

వేదబాహ్యులకును విప్రబంధులకును
బుద్ధిహీనులకును బుణ్యులకును
శిష్టసేవ్యమైన శివకథాశ్రవణంబు
ముక్తి నొసఁగు మౌనిముఖ్యులార.

272


క.

నరు లెవ్వరేని నిద్ధరఁ
బురహరుచరితంబు భక్తిబూర్వకముగా నా
దర మొప్ప నాలకించిన
నరయఁగ శ్రీరుద్రతుల్యు లగుదురు వారల్.

273


క.

అవిరతముగ శైవకథా
శ్రవణం బొనరింప శక్తిచాలకయున్నన్
భువి నొకముహూర్తమైనను
వివరముగఁ దదర్ధమైన వినఁగా వలయున్.

274