పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/340

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

333


యనములు పదిరెండు నితని కాయు వటంచున్.

265


వ.

అని విన్నవించిన చిత్రగుప్తుని వచనంబు లాకర్ణించి యవ్వీర
భద్రుండు కృతాంతునిం గనుంగొని యీరాజకుమారుండు
వర్షాయుతప్రమాణజీవితుండు నీ విందులకు సందేహింపవలదు
యీయర్థంబు నీమనంబున దృఢంబుగా నిశ్చయించి క్రమ్మఱ
దశసహస్రవర్షప్రమాణజీవితుంగా లిఖియింపు మని యాన
తిచ్చిన వల్లె యని యమ్మహాదేవువాక్యంబులకు సమ్మతించి
మహాభీతుండై యాశమనుం డన్నరేంద్రనందను మృత్యు
బంధంబువలనఁ బాపి తదాజ్ఞాప్రకారంబున లిఖియింపంజేసి
తానును వీరభద్రుచేత బంధముక్తుం డయి మృత్యుకింకర
సమేతంబుగా నిజలోకంబునకుం జనియె వీరభద్రుండును
బ్రమథగణపరివృతుండై తనలోకంబున కరిగె నేను నీవృత్తాం
తంబంతయుం దెలిసి మీసమీపంబునకు వచ్చితి నని పలికి
వెండియు నారదుం డిట్లనియె.

266


శ.

కదనమున వైరివీరుల
మద మణఁచి భవత్సుతుండు మహి నేలుచుఁ దాఁ
బదివేలేండ్లు వసించును
ముదమున నని చెప్పి చనియె మునివరుఁ డంతన్.

267


క.

ఈరుద్రాక్షమహత్వము
ధీరమతిన్ విన్నజనులు దీర్ఘాయుష్మ
త్త్వారోగ్యభాగ్యయుతులయి
ధారుణి వర్ధిల్లుదురు సదాశివుకరుణన్.

268


వ.

ఇవ్విధమున నారదమహామునీంద్రుం డరిగినఁ దదనంతరమునఁ