పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/339

ఈ పుట ఆమోదించబడ్డది

332

బ్రహ్మోత్తరఖండము


ముష్టినిహతుల నొప్పించి యష్టమూర్తి
సభకు రమ్మని యీడ్చె నిశ్శంకుఁ డగుచు.

260

వీరభద్రయమవివాదము

మత్తకోకిల.

అప్పు డర్కతనూజుఁ డెంతయు నబ్బురంబుగ సాధ్వసం
బుప్పతిల్లఁగ మేను గంపము నొందఁగాఁ బ్రణమిల్లి మా
యప్ప యేమిటి కింతకోప మహీనవిక్రమశీల నా
తప్పు సైఁచుము వీరభద్ర కృతాపరాధుఁడ నెంతయున్.

261


మత్తకోకిల.

ఈనరేంద్రకుమారకుం డిపు డెన్నఁగా గతజీవితుం
డైనవాఁ డటుగాన మృత్యుసహాయతం జనుదెంచితిం
గాని నేరము లేదు న న్నిటు గాసిసేయఁగ నేల యో
దీనరక్షక సోమనందన దేవదేవ జగత్పతీ.

262


క.

అని వేఁడిన రవినందనుఁ
గనుఁగొని హరతనయుఁ డనియెఁ గడువడి మాన్యుం
డనఘాత్ముఁడు శతశతహా
యనజీవితుఁ డతనిఁ ద్రుంప నర్హం బగునే.

263


తే.

నీకు సంశయమైన నోనీరజాప్త
తనయ మీచిత్రగుప్తు రాఁ బనుపు మిటకు
నితఁడు నిజముగఁ బదివేలయేండ్లుఁ బ్రదుకు
రుద్రసూక్తాభిషేచనారూఢుఁ డగుట.

264


క.

అనిన విని చిత్రగుప్తుని
నినతనయుఁడు పిలువనంపి హితమతి నడుగన్
విని యతఁడు వచించెను హా