పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/337

ఈ పుట ఆమోదించబడ్డది

330

బ్రహ్మోత్తరఖండము


యిమ్మహాకార్యమంతయు హితము మెఱయ
నిచట మీ రుండి తగ నిర్వహింపవలయు.

253


మ.

అని ప్రార్థించిన సమ్మతించి కృపతో నాశక్తిపుత్త్రుండు స
న్మునిసంఘంబులఁ బిల్వఁబంచి తగఁ దాను న్వారలం గూడి పెం
పునఁ పుణ్యద్రురసప్రయుక్తకటికంబు న్నిల్పి రుద్రాగమం
బున సంసిక్తునిఁ జేసి రానృపసుతుం బూర్ణప్రభావస్థితిన్.

254


వ.

ఇవ్విధమున నారాజనందనుండు మహామును లభిషేచనము
గావింపుచుండునంత సప్తమదినమ్మున నందఱుఁ గనుం
గొనుచుండ మూర్ఛాగతుండై మహామునీంద్రరక్షితుండు
గావునఁ గ్రమ్మఱఁ గొంతప్రొద్దునకుం దెలిసి వారలం గనుం
గొని యి ట్లనియె మహాత్ములారా వినుండు దీర్ఘదంష్ట్రుం
డును భయానకుండును దండహస్తుండును నైన యొక్క
మహాపురుషుండు వచ్చి పాశబద్ధుం జేసి నన్నుఁ గొనిపోవు
చుండునంత నతండు మహాబలపరాక్రమవంతు లైన
పురుషులచేత బద్ధుండై దూరంబుగాఁ జనినవిధంబునం
గానంబడియె నేనును భవత్కటాక్షప్రభావంబున లబ్ధ
జీవుండ నైతి నని విన్నవించిన ముదంబంది యమ్మహామును
లన్నరేంద్రనందనుం గటాక్షించి యనేకాశీర్వచనంబుల
నభినందించిరి ఆభూపాలుండును నిర్భయుం డై యుండె
నంత.

255


శా.

ఆరాజేంద్రుఁడు సంప్రహృష్టహృదయుండై భూసురేంద్రాళికిన్
భూరిప్రాభవ మొప్ప దక్షిణలు తాంబూలంబులున్‌ హేమవా
సోరత్నాదు లొసంగి బాంధవవయస్యోపేతుఁడై షడ్రసా
హారంబు ల్భుజియించియుండెఁ గొలువై యాస్థానమధ్యంబునన్.

256