పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/336

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

329


క.

అని పలికి కమలగర్భుం
డిననందను వీడుకొలిపి హితము దలిర్ప
న్మన మలరఁగ నయ్యిరువుర
కనుమతి గావించి పనిచె నవనీస్థలికిన్.

246


ఆ.

అట్లు గాన నరుల కశ్రద్ధతోఁ జేయు
నిఖిలకార్యములును నిష్ఫలములు
శ్రద్ధతో నొనర్చు జపతపఃపూజాది
సకలధర్మచయము సత్ఫలంబు.

247


క.

ఇది ముఖ్యం బగుమంత్రం
బిది పరమం బైనతపము నిది సర్వసుఖా
స్పద మిదియె ముక్తిసాధన
మిది బహుపాతకహరంబు నెల్లజనులకున్.

248


వ.

అట్లు గావున.

249


శా.

రుద్రాధ్యాయపరాయణుండు ఫణిహారున్ సచ్చిదాకారునిన్
రుద్రు న్నద్యుదకాభిషిక్తునిగ నిర్దోషస్థితిం జేసి ని
ర్నిద్రప్రజ్ఞఁ దదంబుమజ్జనముఁ దా నిత్యంబు గావింపఁగా
భద్రారోగ్యచిరాయురున్నతలు సంభావించు నెల్లప్పుడున్.

250


వ.

అని యానతిచ్చి వెండియు ని ట్లనియె.

251


చ.

అనఘులు శాంతమానసులు నాగమవేదులు సంశితవ్రతుల్
ఘనతరశైవసూక్తము లఖండితవృత్తి నెఱుంగునట్టిస
న్మునులు జపంబు చేసిన నమోఘతదీయతపోవిభూతిచే
జనవర నీతనూభవుఁ డజస్రశుభంబులు పొందియుండెడున్.

252


తే.

ఇట్లు నియమించినట్టి మునీశ్వరునకు
నమ్మహీపతి వందన మాచరించి