పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/334

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

327


వేదంబుల నొసంగి వేదార్థసారమై
        యెసఁగు రుద్రాధ్యాయ మిచ్చెనపుడు


తే.

అమ్మహాధ్యాయమును బూర్వులైనమునులు
భృగుమరీచ్యత్రిముఖులు సంప్రీతి దోఁప
నభ్యసించిరి వారలయనుమతమున
సంగ్రహించిరి భువిలోనిసకలబుధులు.

238


మ.

ధరణీనాథ తదీయశిష్యసుతసంతానోపదేశంబులన్
ధరణింగల్గిన మానవోత్తములు రుద్రాధ్యాయపాఠంబునన్
దురితోచ్చాటనదక్షులై మఱియు నిర్దుష్టాత్ములైయుండఁగా
నరకావాసము శూన్యమైనఁ గని కీనాశుండు దైన్యంబునన్.

239

యముండు బ్రహ్మసభకుఁ బోవుట

క.

ఆనలినజుసన్నిధికిని
భానుసుతుం డరిగి భక్తిఁ బ్రణమిల్లుచుఁ ద
న్మానసమునఁ గృప దోఁపఁగ
దీనోక్తులఁ బలికె నిట్లు దివిజులు వినఁగన్.

240


సీ.

ఓపద్మగర్భ నే నొకవార్త వినుపింతు
       నది యథార్థంబు మహాద్భుతంబు
నరులు రుద్రాధ్యాయనిరతు లై యనిశంబు
       విగతదోషులును బవిత్రచరితు
లగుచు దీర్ఘాయుష్కులై సుఖంబుననుండి
       కడపట శంకరుకరుణచేత
సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య
       ముక్తులు గాంతురు ముదము వెలయ


ఆ.

నస్మదీయలోక మంతయు శూన్యమై