పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/333

ఈ పుట ఆమోదించబడ్డది

326

బ్రహ్మోత్తరఖండము


విని శోకాక్రాంతుఁ డగుచు వివశుం డయ్యెన్.

232


ఆ.

అంత నామునీంద్రుఁ డత్యంతకృపతోడ
నానరేంద్రచంద్రు నాదరించి
వత్స భయముఁ జెందవలవదు విను మింక
హితమృదూక్తు లిప్పు డే వచింతు.

233


క.

వేయేటికి శ్రీరుద్రా
ధ్యాయజపస్నానముల యథావిధి సలుపన్
బాయక నీసుతునకు దీ
ర్ఘాయుర్దాయంబు గల్గు నవనీనాథా.

234


వ.

అని చెప్పిన యమ్మహామునీంద్రునకు నరనాథుం డి ట్లనియె.

235


క.

శ్రీరుద్రాధ్యాయజపం
బేరీతి నొనర్పవలయు నెవ్వరు దైవం
బారయఁ దత్ఫల మెయ్యది
యారూఢిగఁ దెలియఁ బల్కు మాదరమొదవన్.

236


వ.

అని యడిగిన రాజునకు మునీంద్రుం డి ట్లనియె.

237

పరాశరుండు భద్రసేనమహారాజునకు రుద్రాధ్యాయప్రభావం బెఱింగించుట

సీ.

ఆదికాలంబున నభవుఁ డొక్కఁడు దక్క
        నొగి జగంబులు లేక యుండు నంత
నజుఁ డవ్యయుఁడు సచ్చిదానందమయమూర్తి
       యాద్యుఁడు శంకరుం డైనశివుఁడు
తనరజోగుణమున ధాతను నిర్మించె
       సృష్టికార్యం బెల్లఁ జేయుటకును