పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/332

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

325


క.

మునినాథ భవద్దర్శన
మున నజ్ఞానంబు పాసె ముక్తి లభించె
న్మన మలరఁగ సత్సంగతి
జనవితతికిఁ గామధేనుసదృశము గాదే.

226


క.

అటు గావున నే నిఁక నొ
క్కటి యడిగెద నిక్కుమారుకథ తెలియుట కీ
విటమీఁద నితనియాయుః
పటుతరకీర్తిప్రతాపబలములు చెపుమా.

227


వ.

అని యడిగిన నారాజునకు వసిష్ఠపౌత్రుం డి ట్లనియె.

228


ఆ.

వాచ్యమయినపలుకు వచియింపఁగా దగుఁ
బలుకఁ దగనిపలుకు పలుకఁగూడ
దెంతధీరులైన సంతాప మందుదు
రట్లు గాన నిక్క మాడఁ జనదు.

229


క.

అయినను నిష్కపటంబగు
మానసమున నడిగె దీవు మనుజేంద్ర భవ
త్సూనునివార్త యథాస్థితి
యేను వచించెద మదీయహితుఁడవు గానన్.

230


క.

నరవర నీనందనునకుఁ
బరమాయుర్వత్సరములు పండ్రెం డగు ముం
దఱఁగా నష్టమదినమున
మరణము ప్రాపించు నీకుమారున కనఘా.

231


క.

అని నిశ్చయముగఁ బలికిన
మునివచనము కర్ణశూలముగఁ దోఁపఁగ నా
జనపతి భీతాత్మకుఁడై