పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/329

ఈ పుట ఆమోదించబడ్డది

322

బ్రహ్మోత్తరఖండము


మ.

విటుల న్మచ్చిక చేసి మైత్రి మెఱయ న్విత్తంబు లార్జించుటో
ఘటికాసిద్ధియు మంత్రసిద్ధి యనురక్తు ల్మీఱ సాధించుటో
స్ఫుటవీణాదికహృద్యవాద్యముల నేప్రొద్దు న్విచారించుటో
చటులజ్వాలకృశానునందుఁ జొర వేశ్యాస్త్రీలకున్ ధర్మమే.

212


క.

అని పలికిన బాంధవులం
గనుఁగొని యక్కాంత యనియెఁ గలలో నైనం
జనునే బొంకులు పలుకఁగఁ
దనువులు నర్థములు సిరియుఁ దగు నిత్యములే.

213


తే.

సత్యభాషణ మిహపరసాధకంబు
సత్యవాక్యంబు ధర్మంబు జయకరంబు
సత్యమున సర్వశుభములు సంఘటిల్లుఁ
గాన సత్యంబు జనులకుఁ గలుగవలయు.

214


క.

రవి పడమట నుదయించినఁ
గువలయబంధుఁడు మహోష్ణగుణుఁడై యున్నన్
భువిపైఁ దారలు డుల్లినఁ
బ్రవిమలసత్యోక్తి విడువ భామినులారా.

215


వ.

అని యిట్లు దృఢనిశ్చయంబుగాఁ బలికి బాంధవజనముల
నొడంబఱిచి యవ్వారకామిని యాక్షణమున మంగళ
స్నానము గావించి జంబూనదాంబరయుగ్మధారిణియై హరి
ద్రాంజనసిందూరకాదులు ధరియించి పురంబునం గల
బ్రాహ్మణోత్తముల రావించి తనగృహమునం గల ధనకనక
వాహనంబులును నమూల్యకాంచనమణిమయాభరణ
ములు ననేకగోమహిషశిబికాసనశయ్యాప్రముఖసర్వ
వస్తువులును వారలకు సమర్పించి పరమేశ్వరధ్యానంబుఁ