పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/327

ఈ పుట ఆమోదించబడ్డది

320

బ్రహ్మోత్తరఖండము


ములను బరితుష్టిఁ బొంది నిర్మలసువర్ణ
తల్పముల వైశ్యవిటుఁడును దానుఁ గూడి
పంచశరకేళి నటు పవ్వళించియుండె.

203


క.

ఈరీతిని శయనింపఁగ
నారేయి నహేతుకముగ నగ్నిజ్వాలా
ఘోరంబై యల నాట్యా
గారము సందగ్ధమయ్యెఁ గర్మానుగతిన్.

204


ఆ.

అంత వారకాంత యచ్చటి కేతెంచి
చిత్తసాధ్వసంబుఁ జెందియున్న
కీశకుక్కుటముల పాశంబు లూడ్చిన
బంధముక్తి దనరఁ బరచె నవియు.

205


సీ.

స్తంభంబుతోడ నిర్దగ్ధమై శకలీకృ
        తం బైన రత్నలింగంబుఁ గాంచి
వైశ్యుండు వేశ్యయు వ్యధఁ జెంది రప్పు డ
        య్యతివకు నాతఁ డిట్లనుచుఁ బలికె
నంగన విను శివలింగంబు నిర్భిన్న
        మైయుండ జీవించు టర్హమగునె
కావున నీదు కింకరుల నియోగించు
        చితిసేయఁ బంపుము సిద్ధముగను


తే.

నిప్పు డఖిలామరులును బ్రహ్మేంద్రవిష్ణు
లాదిగా వచ్చి వలవదటన్న వినక
నభవు మది నిల్పి దహనంబునందుఁ జొచ్చి
యిపుడ ప్రాణపరిత్యాగ మాచరింతు.

206