పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/326

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

319


ధనరత్నాభరణాదు లిచ్చు టరుదే ధన్యుండ వీ వట్లుగా
వున నీకంకణమిచ్చి చిత్త మలరన్‌ భోగింపు మత్యాదృతిన్.

198


వ.

అనిన విని వైశ్యుఁ డిట్లనియె.

199


చ.

విను హరిణాక్షి యిద్ధరను వేడుకకు న్వెలలేదు గావున
న్గొను మిదె రత్నకంకణముఁ గూరిమి నిచ్చెదనైన దీనికిన్
దినములసంఖ్య దెల్పుము మదీయమనోరథసిద్ధికై యన
న్విని కలకంఠి పల్కె పృథివీస్పృశుఁ జూచి గభీరభాషలన్.

200


తే.

యామినీత్రయపర్యంత మాత్మనాథ
నాదుదేహంబు భవదధీనం బొనర్తు
సత్య మీపల్కు దీనికి సాక్షు లర్క
చంద్రులని చాటి చెప్పె నాచంద్రవదన.

201


క.

విహితక్రియ వర్తింతును
సహధర్మిణి నగుదు నంచు సమ్మతముగ న
మ్మహిళారత్నము వైశ్యుని
మహితోరఃస్థలము ముట్టె మమత దలిర్పన్.

202


సీ.

అప్పుడు పల్లవుం డైన వైశ్యాగ్రణి
        కాంతకు రత్నకంకణ మొసంగి
మఱియును దా నొక్కమణిమయలింగంబు
        నతిగోప్యముగ దాఁచు మనుచు నిచ్చె
నెప్పుడు భిన్న మౌ నిమ్మహాలింగంబు
        నప్పుడు విడుతుఁ బ్రాణానలముల
నని వచించిన నట్ల యగునంచు నాట్యమం
        టపమున నొక్కచో డాచి వచ్చి


తే.

యాలయంబున కేఁగి మృష్టాన్నపాన