|
శరీరులై యుండుదురు వీర లిట్లుండుట కెద్దిహేతువు సర్వ
జ్ఞులు త్రికాలజ్ఞులు నైనమీర లీయర్థంబు సవిస్తరముగా
మాకుం దెలుపవలయు నని యడిగిన భద్రసేనభూపాలు
నకుఁ బరాశరమహామునీంద్రుం డి ట్లనియె.
| 185
|
పరాశరుండు సుధర్మతారకులవృత్తాంతంబు దెలిపెడుకథ
క. |
జననాథ విను భవన్నం
దనవరయుష్మత్ప్రధానతనయులగుణముల్
ఘనచరితంబులు దెలియఁగ
వినుపించెద వీరిపూర్వవృత్తాంతంబుల్.
| 186
|
క. |
నందిగ్రామం బనుపుర
మందముగా నుండు కోసలావని సతతం
బందుండు నొక్కతె మనో
నందిని యనువారవనిత నవయౌవన యై.
| 187
|
సీ. |
చతురంతయానము ల్చామరఛత్రము
ల్భాసురతరములౌ పాదుకలును
లాలితామూల్యదుకూలాంబరంబులుఁ
దపనీయపర్యంకతల్పములును
జిత్రమాల్యములు దాసీదాసజనములు
గోమహిష్యాదికస్తోమములును
కర్పూరమృగమదగంధలేపనములు
మణికాంచనవిరాజమానగృహము
|
|
తే. |
భూషణంబులు మృష్టాన్నభోజనంబు
నప్రమేయధనంబు ధాన్యాదికములు
గలిగి పరిపూర్ణభోగభాగ్యముల వెలయు
|
|