పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/322

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

315


మ.

రణదుద్యన్మణిదీప్యమానకనకగ్రైవేయకోటీరకం
కణహారాంగదనూపురాదుల నలంకారంబు గావించినన్
క్షణమాత్రంబునఁ బాయఁద్రోచి కడువేడ్క ల్మీఱ రుద్రాక్షభూ
షణము ల్దాల్తురు వారలిర్వురు మహోత్సాహంబు దీపింపఁగన్.

180


క.

అక్షీణకృపాకలితక
టాక్షములఁ దదీయజనకు లనురాగమునన్
శిక్షించిన విడువక రు
ద్రాక్షతతు ల్దాల్తు రెపుడుఁ దన్మాణవకుల్.

181

పరాశరుండు భద్రసేనుసభకు వచ్చుట

తే.

అంతఁ గొన్నిదినంబుల కరుగుదెంచె
ముదము దోఁపఁ బరాశరమునివరుండు
భద్రమతి భద్రసేనభూపాలుసభకు
వాసవునిఁ జేర గురుఁడు విచ్చేసినట్లు.

182


క.

ఎదురేఁగి మ్రొక్కి భూపతి
ముదమున నర్ఘ్యాదివిధుల మునిసుత్రామున్
సదమలమతిఁ బూజించెను
మృదుతరగంభీరమధురమితవచనుం డై.

183


తే.

ఇట్లు పూజించి యమ్మానవేశ్వరుండు
విమలమణిమయకనకపీఠమున నునిచి
కుశలసంప్రశ్న మొనరించి కొన్నివార్త
లడిగి ప్రస్తావమున మౌని కనియెఁ బ్రీతి.

184


వ.

మునీంద్రా మదీయనందనుం డైనసుధర్ముండు నస్మత్ప్రధాని
కుమారుం డయినతారకుండను వీర లిరువురు బాలకులు
మణిమయాభరణంబులు విసర్జించి రుద్రాక్షభూషణాలంకృత