మ. |
రణదుద్యన్మణిదీప్యమానకనకగ్రైవేయకోటీరకం
కణహారాంగదనూపురాదుల నలంకారంబు గావించినన్
క్షణమాత్రంబునఁ బాయఁద్రోచి కడువేడ్క ల్మీఱ రుద్రాక్షభూ
షణము ల్దాల్తురు వారలిర్వురు మహోత్సాహంబు దీపింపఁగన్.
| 180
|
క. |
అక్షీణకృపాకలితక
టాక్షములఁ దదీయజనకు లనురాగమునన్
శిక్షించిన విడువక రు
ద్రాక్షతతు ల్దాల్తు రెపుడుఁ దన్మాణవకుల్.
| 181
|
పరాశరుండు భద్రసేనుసభకు వచ్చుట
తే. |
అంతఁ గొన్నిదినంబుల కరుగుదెంచె
ముదము దోఁపఁ బరాశరమునివరుండు
భద్రమతి భద్రసేనభూపాలుసభకు
వాసవునిఁ జేర గురుఁడు విచ్చేసినట్లు.
| 182
|
క. |
ఎదురేఁగి మ్రొక్కి భూపతి
ముదమున నర్ఘ్యాదివిధుల మునిసుత్రామున్
సదమలమతిఁ బూజించెను
మృదుతరగంభీరమధురమితవచనుం డై.
| 183
|
తే. |
ఇట్లు పూజించి యమ్మానవేశ్వరుండు
విమలమణిమయకనకపీఠమున నునిచి
కుశలసంప్రశ్న మొనరించి కొన్నివార్త
లడిగి ప్రస్తావమున మౌని కనియెఁ బ్రీతి.
| 184
|
వ. |
మునీంద్రా మదీయనందనుం డైనసుధర్ముండు నస్మత్ప్రధాని
కుమారుం డయినతారకుండను వీర లిరువురు బాలకులు
మణిమయాభరణంబులు విసర్జించి రుద్రాక్షభూషణాలంకృత
|
|