పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/319

ఈ పుట ఆమోదించబడ్డది

312

బ్రహ్మోత్తరఖండము


మ్మత్తకాశిని నాత్మగేహినిమాడ్కి నెమ్మది నెంచుచున్
నృత్తగీతకళాదివిద్యల నెమ్మిఁ గాలముఁ బుచ్చుచున్
జిత్తసంభవకేళిఁ దేల్చె విచిత్రబంధము లొప్పఁగన్.

169


వ.

ఇవ్విధమున నాదంపతు లశ్రాంతరతికాములై రతికాముల
చందమునం బ్రవర్తింపుచు ననేకసంవత్సరములు భూతల
మున యథేష్టభోగము లనుభవింపుచుండిరి యంతఁ గొంత
కాలమున కావిప్రుండు విగతజీవుం డైన నతనితోడ
నాశారదయు ననుగమనంబు గావించెఁ దదనంతరం
బయ్యిరువురు దివ్యదేహములు ధరియించి విమానా
రూఢులై శివలోకమునకుం జని సుఖమున నుండి రని చెప్పి
సూతుం డమ్మునీంద్రుల కి ట్లనియె.

170


చ.

యతివరులార భక్తివినయంబులు మీఱ నుమామహేశ్వర
వ్రతకథ యెవ్వరేనియును వ్రాసిన విన్నఁ బఠించినంత సం
తతబహుపుత్త్రపౌత్రధనధాన్యచిరాయురుపేతులై విని
ర్గతభయశోక మైనగరకంఠనివాసముఁ గాంతు రెప్పుడున్.

171

రుద్రాక్షమహత్త్వము

ఉ.

అక్షయభోగదాయక మఘాపహరంబు శుభప్రదంబు ఫా
లాక్షమనఃప్రియంబు సకలద్విజబృందనిమేషణార్హమున్
మోక్షఫలప్రదంబును సముజ్జ్వలగాత్రపవిత్ర మైనరు
ద్రాక్షమహత్వ మెన్నెదను దాపసులార వినుండు వేడ్కతోన్.

172


క.

రుద్రాక్షవిభూషితు లగు
భద్రాత్ములు నిష్కళంకభాగ్యాన్వితు లై
యద్రిసుతావిభుకృప నిరు
పద్రవులై యుందు రెపుడు ప్రజలు నుతింపన్.

173