పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/318

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

311


నీకుమారతిలక మెట్లు నీకు జనించెఁ
దెలియఁ బలుకవలయు దీనివిధము.

165


క.

అని పరిహాసముగాఁ బలి
కిన విప్రునివాక్య మాలకింపుచు లజ్జా
వనతాస్య యగుచు నప్పుడు
వనితామణి యూరకుండె వచనరహితయై.

166


సీ.

ఇవ్విధంబున నుండి యెలనాఁగ యొక్కింత
        తడవు విచారించి ధైర్యమూఁది
యాభూమిసురున కి ట్లని పల్కె నప్పు డో
        యనఘ నీ విట్లు న న్నడుగ నేల
నను నీ వెఱుంగుదు నిను నే నెఱుంగుదు
        మనల కిర్వురకును మనసు సాక్షి
సంతతం బగుస్వప్నసమయంబునందుల
        నన్యోన్యసౌహార్ద మలరుచుండ


తే.

నుదయమందెను శారదేయుం డనంగ
ధీరుఁ డితఁ డని సర్వంబుఁ దెలియఁబల్కి
తద్వ్రతఫలంబులోన నర్ధం బొసంగి
నిజతనూభవు నిచ్చె నాద్విజున కపుడు.

167


ఉ.

భూసురశేఖరుండు నిజపుత్త్రకుఁ గౌఁగిట గారవించి సం
త్రాసములేక దానితలిదండ్రులచేత ననుజ్ఞ గాంచి సో
త్ప్రాసము మీర ధాతృలిఖితంబు యథాస్థితిఁ దప్పకుండఁగా
నాసతిఁ జెట్టఁబట్టుకొని యాత్మపురంబున కేఁగె లీలతోన్.

168


మత్తకోకిల.

ఇత్తెఱంగున నద్ధరామరుఁ డింటికిం జనుదెంచి య