పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/316

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

309


తనవచనంబు దథ్యంబు సేయఁదలంచి
         రంజిల్లు గౌరీశ్వరవ్రతంబు


తే.

సేయ నియమించె నట్ల నేఁ జేయుచుండ
నంత గౌరి ప్రసన్నయై యానతిచ్చె
వత్స త్వత్పూర్వభవపతిస్వప్నసంగ
మంబున జనించు నీకుఁ గుమారుఁ డనుచు.

157


తే.

ఇదియ మామకవృత్తాంత మింతకన్న
నన్య మొక్కటి యెఱుఁగ నోయతివలార
సకలమునకును భగవంతుఁ డొకఁడె సాక్షి
యితరజనులకు నీయర్థ మెఱుఁగ నగునె.

158


క.

అని శారద వచియించిన
విని యందఱు నిది దలంప విధికృత మనుచున్
ఘనసంశయవిరహితు లై
చనిరి నిజస్థానములకు సమ్మదలీలన్.

159


వ.

అంత.

160


క.

పదియగునెల నాశారద
సదమలగుణహారు వేదశాస్త్రవిచారున్
మదమాత్సర్యవిదూరు
న్మదననిభాకారు నొకకుమారునిఁ గాంచెన్.

161


వ.

అంత నవ్వనితయుఁ బితృసోదరమాతృబంధుమిత్రసమేతం
బుగా నాత్మనందను నుపలాలనం బొనర్చుచు సుఖంబున
నుండునెడఁ గొన్నిదినంబులకు నొక్కపర్వకాలంబున గోకర్ణ
క్షేత్రమునకుఁ బ్రాగ్దక్షిణపశ్చిమోత్తరదేశంబులం గల్గు
సమస్తజనంబులుం జనుదెంచుచున్నయెడ నాశారదయుఁ