పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/315

ఈ పుట ఆమోదించబడ్డది

308

బ్రహ్మోత్తరఖండము


యువనాశ్వుం డనురాజు మునీంద్రాభిమంత్రితంబు లైన
జలంబులు ద్రావ తద్గర్భంబున మాంధాత యనురా జుద్భ
వించెఁ గావున నివ్వనితయు వారలయట్ల మహావ్రతప్రభా
వంబువలనను మహర్షిపాదసేవనంబువలనను ననిందితంబైన
గర్భంబుఁ దాల్పఁబోలు దీనికి సంశయింప వలవ దేత
ద్గర్భలక్షణంబు నారీజనంబులు రహస్యంబుగా నడిగిన
నీయర్థంబు విస్పష్టం బగు నని పలికిన నావృద్ధబ్రాహ్మణువచ
నంబులకు సమ్మతించి యోషిజ్జనంబు లేకాంతంబుగా నాశా
రదావధూటి సాంత్వనవచనంబుల నాశ్వాసించి యి ట్లనిరి.

154


ఆ.

పురుషసంగమమునఁ బొలఁతులు గర్భంబుఁ
దాల్చుచుందు రెపుడు ధాత్రియందుఁ
బురుషహీన వగుచుఁ బొందుగా గర్భణి
వగుట కేమి హేతు వంబుజాక్షి.

155


క.

లోకంబులోన నిట్టి వ
నేకంబులు గలవు దలఁప నిది యబ్బురమే
యేకాంతభావ మొప్పఁగ
నోకోమలి మాకుఁ దెలుపు ముల్లం బలరన్.

156


సీ.

అనిన శారద యిట్టులనిన వారలతోడ
       వినుఁ డొకదినమున విప్రవరుఁడు
జాత్యంధుఁ డైనట్టిసంయమి చనుదెంచి
       యస్మత్కృతార్చన కాత్మనలరి
మాంగల్యవతి వగు మని పల్కి యటమీఁద
       నాదువృత్తాంతమంతయును దెలిసి