పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/314

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

307


జగతిపైఁ బడు మదికి విస్మయము దోఁప.

152


క.

అని భయ మొదవఁగఁ బలికిన
విని యందఱు పరమహర్షవిస్ఫారితలో
చనులై తమమనముల నా
వనిత పతివ్రత యటంచు వర్ణించి రొగిన్.

153


వ.

ఆసమయంబున నివ్వెఱగంది యున్నసభ్యులం గనుంగొని
తత్త్వవిదుం డైనయొక్కవృద్ధవిప్రుం డి ట్లనియె నీప్రపంచం
బంతయు నీశ్వరమాయామయం బీసంసారచక్రంబునందు
భావ్యాభావ్యంబులు లేవు నీయర్థంబు భగవంతుం డైన
పరమేశ్వరుం డెఱుంగుఁగాని యితరులకుం దెలియ నలవి
గాదు తొల్లి యువకేతుం డనురాజర్షివీర్యంబు జలంబులం
బడినఁ దజ్జలపానం బొనరించి యొక్కకన్యక గర్భంబు ధరి
యించె విభాండకమహామునీంద్రుశుక్లంబు పానంబు సేసి
యొక్కహరిణి గర్భంబు దాల్చి ఋశ్యశృంగుం డనుమహా
మునిం గాంచె సురాష్ట్రుం డనురాజుదేహంబు స్పృశియించి
యొక్కకురంగి గర్భిణియై తామసుం డనుమనువుం బడసె
నిత్తెఱంగున నుపరిచరుం డగువసురాజవీర్యంబు యమునా
జలంబులం బడిన నం దొక్కమత్స్యంబు ద్రావుటం జేసి
తద్గర్భంబున సత్యవతి సంభవించె మహిషీగర్భంబున
మహిషాసురుండు జనియించె సత్యపురంబునం గల్గునారీ
జనంబు లొక్కకారణంబున గర్భము దాల్చిరి. వసుదేవ
సమాగమంబు లేక రోహిణీదేవి గర్భంబు దాల్చి బల
భద్రునిం గాంచె జాంబవతీనందనుం డైనసాంబునిజఠరం
బున మహర్షిశాపంబునం జేసి యొక్కముసలం బుద్భవించె