పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/308

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

301


యంబికాదేవి ప్రత్యక్ష మయ్యె నపుడు.

122


ఉ.

ఆసమయంబునందుఁ దగ నంధకుఁడైన మహామునీంద్రుఁడున్
భూసురకాంతయు న్భుజగభూషణుసాధ్వికి సాఁగి మ్రొక్కి పా
ద్యాసనసంవిధానముల నర్చితగా నొనరించిన న్మహో
ల్లాసముతో భవానియును లాలితభాషల వారి కిట్లనెన్.

123


క.

మీభక్తిశ్రద్ధలకును
మీభాస్వద్వ్రతమునకును మెచ్చితి భవదీ
యాభీష్టార్థ మొసంగెద
నో భూసురవర్య వేఁడు ముత్సాహమునన్.

124


వ.

అని యానతిచ్చిన యమ్మహాదేవికిఁ బ్రణమిల్లి ద్రువమహా
మునీంద్రుం డి ట్లనియె.

125


శా.

దైవాధిష్ఠితకర్మయోగమున జాత్యంధుండ నై యుండ నో
దేవీ నిష్పతి యైన యీవనిత భక్తిశ్రద్ధఁ బూజింప నేఁ
జూవే దీర్ఘసుమంగలీ భవ యటంచున్ స్వస్తిగాఁ బల్కితి
న్నావాక్యంబు యథార్థమౌనటుల నానందాప్తిఁ గావింపవే.

126


క.

పతితోడుతఁ జిరకాలము
నతిమైత్రి మెలంగునట్లు నాపిమ్మట స
త్సుతు నొకనిఁ బడయునట్లుగ
నతివకు వర మిమ్ము మది మహాదర మొదవన్.

127


క.

అని ప్రార్థించిన విప్రుని
వినయోక్తుల కలరి శైలవిభుకన్యక నె
మ్మనమున దయ దళుకొత్తఁగ
వనిత న్వీక్షించి పలికె వాక్యప్రౌఢిన్.

128