పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/306

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

299


యిమ్మహావ్రతరాజ మీడేర్పవలయు.

117


క.

అని చెప్పిన మునివరుశా
సనమున నుత్సాహ మొదవ శారదయును స
జ్జనబంధుసమ్మతంబుగఁ
బనుపడఁ దద్ర్వత మొనర్చెఁ బ్రాకటభక్తిన్.

118


పంచచామరము.

మహాప్రసూనభాసమానమంటపాంతరంబున
న్మహీసురోత్తమోపదిష్టమంత్రతంత్రదీక్షలన్
మహేంద్రముఖ్యదేవమౌనిమాన్య మైనయాయుమా
మహేశ్వరవ్రతం బొనర్చె మంజువాణి యంతటన్.

119


క.

కూర్పాసకాంశుకంబులు
శూర్పయుగంబులును గంఠసూత్రములు లస
త్కర్పూరవీటికాదులు
నర్పించె సువాసినులకు నతిదృఢభక్తిన్.

120


వ.

ఇవ్విధంబున నాశారదావధూటి దనకు నై ధ్రువమహా
మునీంద్రుం డాచార్యుండుగా మార్గశీర్షమాసమున శుక్ల
పక్షచతుర్దశీదినమున నుమామహేశ్వరవ్రతం బుపక్ర
మించి యథావిధ్యుక్తంబుగా భక్తిశ్రద్ధాసమన్వితయై
యొక్కసంవత్సరము సాంగముగా నాచరించి తదనంత
రమున వ్రతోద్యాపనము గావింప సమకట్టి నిజమందిరం
బలంకృతంబు గావించి క్రమ్మఱఁ బూర్వోక్తం బైనదినంబు
నం దుపవసించి పుణ్యతీర్థజలస్నాతయు ధౌతపరిధానధారి
ణియు మౌనవ్రతపరాయణయు నై సాయాహ్నసమయం
బున గృహంబుఁ బ్రవేశించి యచ్చట కదళికాస్తంభశోభిత