పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/304

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

297


క.

ఈవిధమున నావిప్రుఁడు
దీవించిన యింతి యనియె ధీరోత్తమ నే
నేవిధి చిరంటి నగుదును
దా విశ్వస్త నని నుడివెఁ దథ్యము గాఁగన్.

107


వ.

మహాత్మా మీర లమోఘసంకల్పులును యథార్థవాదు
లును మహర్షిసత్తములు గావున భవదాశీర్వచనం బెట్లు
సంఘటింప నేర్చు దురంతచింతాభరాక్రాంతనైయున్న న
న్నుద్ధరింప మీరలు దక్క నొండు శరణంబు లేదని చరణం
బుల వ్రాలియున్న శారదం గటాక్షించి యత్యంతకరుణా
రసపూర్ణహృదయుఁడై యమ్మహామునీంద్రుం డిట్లనియె.

108


చ.

కమలదళాక్షి యే నిపుడు కన్నులు గాననివాఁడ నౌట నె
య్యము దళుకొత్తఁగా నిను శుభాంగివి గమ్మని యే వచించితిం
బ్రమదము దోఁప నీదయినభక్తికి మెచ్చితిఁ గాని నిన్ను ని
క్కముగఁ జిరంటిఁ జేతుఁ గలకాలము నుల్లము పల్లవింపఁగన్.

109


క.

చతురత నుమామహేశ
వ్రతనియమ మొనర్చి వృషభవాహు భవాని
న్మతి నిల్పి పూజ సల్పిన
నతిశయసౌభాగ్య మొదవు ననవరతంబున్.

110


వ.

అనిన శారద యి ట్లనియె.

111


క.

మునినాథ నీయనుగ్రహ
మునఁ జేసెద నీవ్రతంబు ముదము దలిర్పన్
జనవినుత సవిస్తరముగ
వినుపింపుము దానితెఱఁగు విశదముగాఁగన్.

112


వ.

అని యడిగిన నమ్మహానుభావుం డి ట్లనియె.

113