పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/302

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

295


వ్రాసిన జదివినను విన్నవారలకు భవా
నీశుకరుణాకటాక్షా
వేశంబునఁ జెందు సిరులు విద్యాసిద్ధుల్.

97


వ.

అని చెప్పి సూతుం డి ట్లనియె.

98


చ.

స్తుతమతులార క్రమ్మఱ విశుద్ధత మీఱ నుమామహేశ్వర
వ్రతపరిపూర్ణపుణ్యకథ రంజిలఁ దెల్పెద నాలకింపుఁడీ
సుతపశుమిత్రబాంధవయశోబలవర్ధన మార్యవంద్యమున్
సతతశుభాస్పదం బదియు శాశ్వతముక్తిఫలప్రదం బగున్.

99

ఉమామహేశ్వరవ్రతమునందు శారదోపాఖ్యానము

క.

జనసుతుఁ డార్యావర్తం
బున విశ్వరథుం డనంగ భూసురవర్యుం
డనఘాత్ముఁడు గలఁ డొకరుఁడు
మనసిజమదహరణభక్తిమార్గరతుం డై.

100


క.

ఆవిప్రకులోత్తమునకు
దైవనియోగమునఁ జేసి తనయారత్నం
బావిర్భవించె నొక్కతె
సావిత్రీప్రతిభ గలిగి శారద యనఁగన్.

101


సీ.

ఆకన్యకారత్న మప్పు డష్టమవర్ష
        మున నుండఁ జూచి తజ్జనకుఁ డంత
వైవాహిక మొనర్ప వలయు నటంచును
        మది నిశ్చయించి సమ్మదమువలన
నొకవిప్రసుతునకు నకలంకమతి నిచ్చె
       నంత నాద్విజుఁడు మధ్యాహ్నసమయ
మునఁ గృతోద్వాహుఁడై మొనసి సాయం