పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/298

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

291


హారమునకుఁ జితాభస్మ మబ్బదయ్యె
శైవపూజాంతరాయంబు సంభవించెఁ
గాన నిఁక నేమి యొనరింతుఁ గమలవదన.

78


క.

గురువాక్యోల్లంఘనమున
దురితంబులు వొందుగానఁ దొయ్యలి వినుమా
పరమేశ్వరుఁ బూజింపక
తిరముగ భుజియింప నొల్ల దృఢమతి నెపుడున్.

79


వ.

అని ఇవ్విధమున నుడివిన ప్రాణవల్లభునకుఁ దత్కళత్రం
బి ట్లనియె.

80


సీ.

ప్రాణేశ దీనికై బరితాపమేటికి
        నిపు డొక్కసదుపాయ మేను గంటి
బహుదారుమయనిజగృహదాహ మొనరించి
        తనమేను వైచి దగ్ధంబుఁ జేతుఁ
దద్భస్మమున నివేదన మాచరింపుము
        పరమేశ్వరునకు సాదరత మెఱయ
నని విన్నవించినఁ దనపత్ని వీక్షించి
       శబరుండు పలికె విస్మయము నొంది


తే.

సరసధర్మార్థకామమోక్షముల కెపుడు
సాధనంబు సుఖార్హంబు సకలభోగ
భాజనమును దయావనం బైనతనువు
నెట్లు విడిచెదు సంతానహీన వగుచు.

81


వ.

అని పలికిన శబరునిఁ జూచి శబరి యి ట్లనియె.

82


క.

పరజనులకుఁ దా నిచ్చిన
శరీరమున సుకృత మొదవు సాక్షాజ్జగదీ