|
రాకల్పంబుగ నుందురు
శ్రీకంఠపురంబునందుఁ జిరతరభక్తిన్.
| 57
|
తే. |
పుస్తకమునందు భువనప్రశస్త మైన
భస్మమహిమంబు వ్రాసి సద్భక్తి నభవు
భక్తకోటుల కొసఁగినపాత్రులకును
బాపములు వాయు హరుకృప భాగ్యమొదవు.
| 58
|
చ. |
శివచరణారవిందములు చిత్తమునన్ భజియింపుచుండుఁడీ
భువనగణేశునిం దలఁచి భూతి లలాటమునన్ ధరింపుఁడీ
సవనవిరోధికీర్తనము సమ్మతిఁ జేయుఁడు సార్వకాలముం
దివిజమునీంద్రులార జననీస్తనదుగ్ధము లాన రెన్నఁడున్.
| 59
|
వ. |
అని చెప్పిన విని యమ్మహామునీంద్రులు ప్రహృష్టాంతరంగు
లై క్రమ్మఱ సూతున కి ట్లనిరి.
| 60
|
ఉ. |
శ్రీగిరిజాధినాథపదసేవనసక్తమనోవిచక్షణ
శ్రీగురువర్యవాక్సరణిచే నుపదేశముఁ గాంచువారికిన్
బాగుగ ముక్తి గల్గు నని పల్కితి కేవలదేశికోక్తిచే
నేగతి నిష్టసిద్ధి యగు నీకథఁ దెల్పుము మాకు నేర్పడన్.
| 61
|
వ. |
అని యడిగిన సూతుం డి ట్లనియె.
| 62
|
సూతుండు శౌనకాదిఋషులకు భక్తిశ్రద్ధాస్వరూపంబుల నితిహాసరూపంబుగా నెఱింగించుట
క. |
శ్రద్ధయె లోకహితం బగు
శ్రద్ధయె నిజజననిపగిది సౌఖ్యము లొసఁగున్
శ్రద్ధాపరుల నభీష్టస
మృద్ధులుగాఁ జేయుచుందు రెల్లసుపర్వుల్.
| 63
|
శా. |
శ్రద్ధాభక్తిసమేతు లై విబుధులన్ సంప్రీతిఁ బూజించిన
|
|