పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/294

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

287


రాకల్పంబుగ నుందురు
శ్రీకంఠపురంబునందుఁ జిరతరభక్తిన్.

57


తే.

పుస్తకమునందు భువనప్రశస్త మైన
భస్మమహిమంబు వ్రాసి సద్భక్తి నభవు
భక్తకోటుల కొసఁగినపాత్రులకును
బాపములు వాయు హరుకృప భాగ్యమొదవు.

58


చ.

శివచరణారవిందములు చిత్తమునన్ భజియింపుచుండుఁడీ
భువనగణేశునిం దలఁచి భూతి లలాటమునన్ ధరింపుఁడీ
సవనవిరోధికీర్తనము సమ్మతిఁ జేయుఁడు సార్వకాలముం
దివిజమునీంద్రులార జననీస్తనదుగ్ధము లాన రెన్నఁడున్.

59


వ.

అని చెప్పిన విని యమ్మహామునీంద్రులు ప్రహృష్టాంతరంగు
లై క్రమ్మఱ సూతున కి ట్లనిరి.

60


ఉ.

శ్రీగిరిజాధినాథపదసేవనసక్తమనోవిచక్షణ
శ్రీగురువర్యవాక్సరణిచే నుపదేశముఁ గాంచువారికిన్
బాగుగ ముక్తి గల్గు నని పల్కితి కేవలదేశికోక్తిచే
నేగతి నిష్టసిద్ధి యగు నీకథఁ దెల్పుము మాకు నేర్పడన్.

61


వ.

అని యడిగిన సూతుం డి ట్లనియె.

62

సూతుండు శౌనకాదిఋషులకు భక్తిశ్రద్ధాస్వరూపంబుల నితిహాసరూపంబుగా నెఱింగించుట

క.

శ్రద్ధయె లోకహితం బగు
శ్రద్ధయె నిజజననిపగిది సౌఖ్యము లొసఁగున్
శ్రద్ధాపరుల నభీష్టస
మృద్ధులుగాఁ జేయుచుందు రెల్లసుపర్వుల్.

63


శా.

శ్రద్ధాభక్తిసమేతు లై విబుధులన్ సంప్రీతిఁ బూజించిన