పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/293

ఈ పుట ఆమోదించబడ్డది

286

బ్రహ్మోత్తరఖండము


కల్పంబులు బ్రహ్మలోకమునను శతత్రయకల్పములు విష్ణు
లోకంబునను వసియించి తదనంతరమునఁ బునరావృత్తి
రహితం బయిన పరమేశ్వరలోకంబునందు ధ్రువంబుగా
నుందురు మునీంద్రా సర్వభూతరహస్యం బైనత్రిపుండ్ర
మాహాత్మ్యంబు నీకుం దెలియఁ బలికితి నీయర్థంబు నీచేతఁ
బ్రయత్నంబుగా గోపనీయంబు గావలయు నని నిర్దేశించి
యప్పరమేశ్వరుం డంతర్ధానంబు నొందు నంత సనత్కుమా
రుండు బ్రహ్మలోకమునకుం జనియె నని చెప్పి క్రమ్మఱ
యోగీంద్రుండు బ్రహ్మరాక్షసున కి ట్లనియె.

52


తే.

దివ్యఫలదాయి మామకదేహలిప్త
భస్మసంపర్కమున నీకు భద్రమైన
తెలివి చెందెనుగాన నిర్మలమనీష
సారభసితంబుఁ దాల్చు విజ్ఞాన మొదవు.

53


వ.

అని పలికి.

54


చ.

అగణితసత్కృపాకలితుఁడై మునినాథుఁడు శైవమంత్రితం
బుగ నొనరించి ఫాలమున భూతివిలేపన మాచరించినన్
విగళితపుణ్య మైనయపవిత్రజగద్భయదాత్మదేహమున్
దెగడుచు బ్రహ్మరాక్షసుఁడు దివ్యశరీరము దాల్చె నంతటన్.

55


చ.

గురుచరణారవిందములకుం బ్రణమిల్లి తదాజ్ఞఁ గాంచి దా
నరుణనిభప్రభాకలితుఁ డై మణిదీప్తవిమానయానుఁ డై
హరుపదముం భజించెఁ దగ నాదరణీయుఁడు వామదేవుఁడున్
ధరణిఁ జరింపఁగా నరిగె ధన్యతనార్తజనాళిఁ బ్రోవఁగన్.

56


క.

ఈకథవిన్నమహాత్ములు
ప్రాకటముగఁ జదివినట్టి భద్రాత్ములు దా