పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/292

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

285


భూతిరేఖ నుదుటఁ బూసిరేని
వారలయిన దురితవర్జితు లై పరి
శుద్ధు లగుచు నుందు రిద్ధచరిత.

48


సీ.

పరసతీగమనంబు పరధనాపేక్షయుఁ
        బరవృత్తిహరణంబు పరధనంబు
కూటసాక్షిత్వంబు కుత్సితభావంబు
        పైశున్యమును సురాపానరతియు
నీచసంసేవయు నీచప్రతిగ్రహ
        మారణ్యదాహంబు ననృతభాష
కన్యారజస్వలాగణికాదికామినీ
        సంగమంబును దివాసంగమంబు


తే.

వేదవిక్రయమన్నాదివిక్రయంబు
నాదిగాఁ గల్గు కలుషంబు లణఁగిపోవుఁ
దక్షణంబున భస్మసంధారణమున
భవ్యగుణగణ్య దివ్యతాపసవరేణ్య.

49


క.

శివభక్తులనిందనమును
శివధనహరణంబు మఱియు శివహేళనమున్
భువి నొనరించిన నరులకుఁ
బ్రవిమలనిష్కృతులు లేనిపాపము లొదవున్.

50


క.

ఏజాతివారలైనను
భూజనములు నుదుట భూతిఁ బూసినమాత్రం
దేజమున సర్వమానవ
పూజితు లై శివపదంబుఁ బొందుదు రనఘా.

51


వ.

మఱియును మహేశ్వరవ్రతనిష్ఠాపరు లైనమానవులు శత