పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/290

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

283


ధర్మంబులు ప్రశ్నోత్తరంబులవలన నాకర్ణింపుచుండి వెండియు
నమ్మహామునీంద్రుం డి ట్లని విన్నవించె.

40


సీ.

సర్వజ్ఞ పరమాత్మ సర్వలోకశరణ్య
        సుఖరూప విను భవన్ముఖమువలన
నపవర్గహేతువు లైనధర్మంబులు
        వింటి నన్నియును సవిస్తరముగ
నేధర్మమార్గంబు లెంచి చూచినను బ
        హ్వాయానజనకంబు లగుచు నుండు
నటుగాన నేధర్మ మప్రయాసకరంబు
        నఘనాశనంబు మహాఫలంబు


తే.

నాగమోక్తంబు ముక్తిదం బగుచునుండు
నట్టిధర్మంబుఁ దెలియ నా కానతిమ్ము
భక్తవత్సల యనినఁ గృపాళుఁ డగుచు
నిందుశేఖరుఁ డమ్మౌని కిట్టు లనియె.

41


తే.

ధర్మములలోన నుత్తమధర్మ మగుచు
వ్రతములందెల్ల నంచితవ్రతము నగుచు
నఖిలజంతురహస్యమై యలరుచుండుఁ
దాపసేంద్ర త్రిపుండ్రసంధారణంబు.

42

సాంబమూర్తి సనత్కుమారునకు భస్మప్రభావం బెఱింగించుట.

చ.

అన విని మౌని యిట్లనియె నాజగదీశ్వరుతోఁ ద్రిపుండ్రసా
ధనమున కెద్ది ద్రవ్యమధిదైవము లెవ్వరు దత్ప్రమాణముల్
ఘనతరశక్తి యెద్ది కుతుకంబున నన్నియు లోకరక్షణం
బునకు వచింపఁగావలయు భూతగణేశ కృపాపయోనిధీ.

43


క.

అని యడిగిన మునిపతి కి