|
ధర్మంబులు ప్రశ్నోత్తరంబులవలన నాకర్ణింపుచుండి వెండియు
నమ్మహామునీంద్రుం డి ట్లని విన్నవించె.
| 40
|
సీ. |
సర్వజ్ఞ పరమాత్మ సర్వలోకశరణ్య
సుఖరూప విను భవన్ముఖమువలన
నపవర్గహేతువు లైనధర్మంబులు
వింటి నన్నియును సవిస్తరముగ
నేధర్మమార్గంబు లెంచి చూచినను బ
హ్వాయానజనకంబు లగుచు నుండు
నటుగాన నేధర్మ మప్రయాసకరంబు
నఘనాశనంబు మహాఫలంబు
|
|
తే. |
నాగమోక్తంబు ముక్తిదం బగుచునుండు
నట్టిధర్మంబుఁ దెలియ నా కానతిమ్ము
భక్తవత్సల యనినఁ గృపాళుఁ డగుచు
నిందుశేఖరుఁ డమ్మౌని కిట్టు లనియె.
| 41
|
తే. |
ధర్మములలోన నుత్తమధర్మ మగుచు
వ్రతములందెల్ల నంచితవ్రతము నగుచు
నఖిలజంతురహస్యమై యలరుచుండుఁ
దాపసేంద్ర త్రిపుండ్రసంధారణంబు.
| 42
|
సాంబమూర్తి సనత్కుమారునకు భస్మప్రభావం బెఱింగించుట.
చ. |
అన విని మౌని యిట్లనియె నాజగదీశ్వరుతోఁ ద్రిపుండ్రసా
ధనమున కెద్ది ద్రవ్యమధిదైవము లెవ్వరు దత్ప్రమాణముల్
ఘనతరశక్తి యెద్ది కుతుకంబున నన్నియు లోకరక్షణం
బునకు వచింపఁగావలయు భూతగణేశ కృపాపయోనిధీ.
| 43
|