పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/287

ఈ పుట ఆమోదించబడ్డది

280

బ్రహ్మోత్తరఖండము


ఆ.

అనుచుఁ దెలియఁ బలికి యాశంభుదూతలు
శమను వీడుకొనుచు సకలజనులు
చూచుచుండ భూమిసురుఁ జేర్చి రప్పుడు
ప్రాకటంపుఁబుణ్యలోకమునకు.

30


వ.

అట్లు గాన సమస్తపాపక్షయంబును మహేశ్వరవిభూషణం
బును నైన భస్మంబు నిరంతరంబు నాచేత ధరియింపంబడు
చుండు ననిన విని యాబ్రహ్మరాక్షసుండు క్రమ్మఱ భస్మ
ప్రభావశ్రవణకుతూహలుం డై యమ్మునీంద్రున కి ట్లనియె.

31


క.

మునినాథ భవద్దర్శన
మున ధన్యుఁడ నగుచు నఘవిముక్తుఁడ నయితిన్
దనరుచు జన్మాంతరకృత
ఘనతరసుకృతప్రభావకారణమహిమన్.

32


మ.

అలఘుప్రాభవ పూర్వజన్మమున సస్యారామవాటీలస
త్సలిలక్షేత్ర మొసంగితిన్ యవనభూపాలుండనై యొక్క ని
శ్చలచిత్తుం డగుబ్రాహ్మణోత్తమునకున్ సంప్రీతితోఁ గావునన్
గలుషవ్రాతములెల్ల వీడెను భవత్కారుణ్యలేశంబునన్.

33


క.

ఇరువదియే నగుభవమున
నురుతరతేజుఁ డగునొక్కయోగీంద్రుకృపన్
దురితంబులఁ బాయుదువని
తరణిసుతుం డానతిచ్చెఁ దథ్యము గాఁగన్.

34


తే.

అట్లు గావున నిర్జనం బైనవనము
నందుఁ ద్వత్సంగతి ఘటించె నద్భుతముగ
నింక భస్మంబు ధరియించియేని దురిత
కర్మములఁ బాయువాఁడ నిక్కము మహాత్మ.

35