పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/284

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

277


ఘోరములగురోగముల శ
రీరము శోషింపఁ దొడఁగె దృఢమాంద్యంబై.

19


ఉ.

అంతట శత్రుపీడితుఁడ నై యనపత్యుఁడ నై దురామయా
క్రాంతుఁడ నై విముక్తబలగర్వుఁడ నై నిజబంధుమిత్రసా
మంతవివర్జితుండ నయి మత్కృతకర్మఫలానుభూతి కా
లాంతముఁ బొంది ఘోరనిరయంబును జెందితిఁ బుణ్యహీనతన్.

20


క.

మునివర దుష్కృతకలుషం
బునఁ జేసి మదీయపూర్వపురుషులు స్వర్గం
బుననుండి వచ్చి నరకం
బున వసియించిరి సమస్తపుణ్యచ్యుతు లై.

21


వ.

వెండియుఁ గృతాంతకింకరులు నన్నుం గొనిపోయి రేతః
కుండీనరకంబునఁ బడఁద్రోచిన నందుఁ బదివేలసంవత్స
రంబులు రేతఃపానంబు గావింపుచుఁ గింకరబాధితుండనై
యుండి యనంతరంబునఁ బాపావశేషంబునఁ గ్రమ్మఱ నిర్జనం
బైనవనంబునఁ బిశాచత్వంబున నుండి నిరంతరంబు
క్షుత్తృష్ణాసమాకులుండ నై దివ్యవర్షశతంబు లుండి యనంత
రంబ ద్వితీయభవంబున సకలప్రాణిభయంకరం బైన
వ్యాఘ్రంబ నై జనియించితి మఱియుఁ గ్రమంబునఁ దృతీయ
భవంబున ఘోరంబైనయజగరంబును జతుర్థభవంబున వృకం
బును బంచమభవంబున విడ్వాహారంబును షష్ఠభవంబునఁ
గృకలాసంబును సప్తమంబున సారమేయంబును నష్టమ
జన్మంబున సృగాలంబును నవమజన్మంబున మృగంబును
నేకాదశంబునఁ గర్కటకంబును ద్వాదశంబున శశకంబును
ద్రయోదశంబున నకులంబును జతుర్దశమున వాయస