పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/276

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

269


క.

వర మడిగెను భద్రాయువు
సరసత మజ్జనకునకును జననికిఁ బద్మా
కరునకుఁ దత్పత్నికిఁ ద
ద్వరసుతునకు ముక్తి యొసఁగవలయు నటంచున్.

309


తే.

కీర్తిమాలిని శ్రీసాంబమూర్తిఁ జూచి
యనియె మాతండ్రి యైనచంద్రాంగదునకు
మఱియు మాతల్లి యైనసీమంతినికిని
నలఘుకైవల్య మొసఁగు మోయభవ యనుచు.

310


వ.

ఇట్లు వేడిన.

311


శా.

అంతన్ శంకరుఁ డావధూవరులవాక్యంబు ల్సమర్థించి య
త్యంతప్రేమఁ దదీయవాంఛితము లుత్సాహంబుతో నిచ్చి సు
స్వాంతం బొప్పఁగ నాక్షణంబున సమస్తాదిత్యవర్గంబుతో
నంతర్ధానముఁ జెందె శీతగిరిజాతాన్వీతుఁడై క్రమ్మఱన్.

312


క.

భద్రాయు వంతటను శ్రీ
రుద్రునిచే వరము లంది రుచిరాననుఁడై
భద్రగతిఁ బురముఁ జేరెను
భద్రేభతురంగముఖ్యబలములు గొలువన్.

313


వ.

ఇ ట్లమ్మహీనాథుండు బ్రహ్మేంద్రాదిదేవతలకుం బడయరాని
సాంబశివప్రసాదంబు వడసి పదివేలసంవత్సరంబులు నిష్కంట
కంబుగా నిజరాజ్యం బేలుచుఁ దురంగమేధాదిమహాక్రతువు
లాచరింపుచుఁ బరమేశ్వరసమారాధన లొనర్చుచు నిజభార్య
యగుకీర్తిమాలినియుం దాను నభీష్టభోగంబు లనుభవింపుచు
వంశకరు లైనపుత్త్రులం బడసి పరమాహ్లాదంబున సుఖంబున
నుండి రంత.

314