శా. |
శౌర్యౌదార్యగుణార్ణవుండు వినుతక్ష్మాపాలనాగవళీ
హర్యక్షుం డగువజ్రబాహుతనయుం డారాజచంద్రుండు ని
ర్ధార్యుండై విబుధు ల్నుతింప జలధారాపూర్వ మౌనట్లుగా
భార్యాదాన మొనర్చె నాద్విజునకున్ బద్ధానురాగంబునన్.
| 293
|
ఆ. |
అటుల దాన మిచ్చి యంత వైశ్వానరుఁ
బ్రజ్వలింపఁజేసి పార్థివుండు
దాను వినతుఁ డై ప్రదక్షిణంబు లొనర్చి
యందుఁ జొరఁగఁబోవు నవసరమున.
| 294
|
భద్రాయువునకు శ్రీసాంబమూర్తి ప్రత్యక్షంబగుట
సీ. |
శ్రీపార్వతీపరిష్కృతశరీరముతోడ
నవసుధాధవళవర్ణంబుతోడఁ
గుండలీకృతమహాకుండలీంద్రులతోడ
డమరుత్రిశూలహస్తములతోడ
మందాకినీవినిర్మలకపర్దముతోడ
రమ్యమౌవ్యాఘ్రచర్మంబుతోడఁ
జంద్రపాండురవృషభేంద్రయానముతోడఁ
గరవిరాజన్మృగాంకంబుతోడ
|
|
తే. |
నారదాదులు సామగానములు చదువఁ
బ్రమథగణములు సేవింప భద్రయశుఁడు
సకలసురచక్రవర్తి శ్రీసాంబమూర్తి
సౌమతేయున కపుడు సాక్షాత్కరించె.
| 295
|
చ. |
కురిసిరి పుష్పవృష్టి సురకోటులు మింట ననేక భేరికా
|
|