పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/271

ఈ పుట ఆమోదించబడ్డది

264

బ్రహ్మోత్తరఖండము


వ.

అంత.

292


శా.

శౌర్యౌదార్యగుణార్ణవుండు వినుతక్ష్మాపాలనాగవళీ
హర్యక్షుం డగువజ్రబాహుతనయుం డారాజచంద్రుండు ని
ర్ధార్యుండై విబుధు ల్నుతింప జలధారాపూర్వ మౌనట్లుగా
భార్యాదాన మొనర్చె నాద్విజునకున్‌ బద్ధానురాగంబునన్.

293


ఆ.

అటుల దాన మిచ్చి యంత వైశ్వానరుఁ
బ్రజ్వలింపఁజేసి పార్థివుండు
దాను వినతుఁ డై ప్రదక్షిణంబు లొనర్చి
యందుఁ జొరఁగఁబోవు నవసరమున.

294

భద్రాయువునకు శ్రీసాంబమూర్తి ప్రత్యక్షంబగుట

సీ.

శ్రీపార్వతీపరిష్కృతశరీరముతోడ
        నవసుధాధవళవర్ణంబుతోడఁ
గుండలీకృతమహాకుండలీంద్రులతోడ
        డమరుత్రిశూలహస్తములతోడ
మందాకినీవినిర్మలకపర్దముతోడ
        రమ్యమౌవ్యాఘ్రచర్మంబుతోడఁ
జంద్రపాండురవృషభేంద్రయానముతోడఁ
       గరవిరాజన్మృగాంకంబుతోడ


తే.

నారదాదులు సామగానములు చదువఁ
బ్రమథగణములు సేవింప భద్రయశుఁడు
సకలసురచక్రవర్తి శ్రీసాంబమూర్తి
సౌమతేయున కపుడు సాక్షాత్కరించె.

295


వ.

అయ్యవసరంబున.

296


చ.

కురిసిరి పుష్పవృష్టి సురకోటులు మింట ననేక భేరికా