పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/268

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

261


కాకయుండెనేని గరళాశనంబు మే
లగ్నిఁ జొరుట యంతకన్న మేలు.

275


క.

శరణాగతుఁ బ్రోవనిభూ
వరుఁ డధమాధముఁడు వాఁడు వసుధాస్థలిపైఁ
జిరజీవి యౌటకన్నను
మరణం బొందుటయు మేలు మనుజాధీశా.

276


క.

అని నిందింపుచు శోకం
బునఁ బొరలుచు లేచుచున్న భూసురనాథున్
గనుఁగొని యారాజేంద్రుఁడు
దనమనమున నిట్టులని వితర్కించెఁ దగన్.

277


ఉ.

మిత్రసమానతేజులును మేరుధరాధరధీరులున్ సుచా
రిత్రులు నార్తరక్షణు లరిందములున్ కలుషౌఘవల్లి కా
దాత్రులు నైనమత్పితృపితామహు లట్లన యిమ్మహీసుర
క్షేత్రముఁ బ్రోచి పుణ్యమునఁ జెందక యే నపకీర్తి జెందితిన్.

278


మత్తకోకిల.

ఈమహీసురుఁ డెంచిచూడ నహీనదివ్యతపోబలో
ద్దామసాహసుఁ డగ్నికల్పుఁ డుదగ్రతేజుఁడు గావునన్
దామసాకృతి మాని సాత్వికతానిరూఢి వహింపఁగా
నీమహాత్ముని వాంఛితార్థము లెవ్వియైన నొసంగెదన్.

279


వ.

అని నిశ్చయించి.

280


ఆ.

విప్రుఁ జేరి మొగము వెలవెలఁబారఁ ద
చ్చరణపద్మములకు సాఁగి మ్రొక్కి
కేలుదోయి నుదుటఁ గీలించి యత్యంత
వినయ మెసఁగ నిట్టు లనియె విభుఁడు.

281