పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/266

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

259


గింపుచు వాసంతికాకుందకురంటకకరవీరాదికుసుమగుచ్ఛం
బులు విదళింపుచు మధురఫలరసమ్ములు గ్రోలుచు మరందమ్ము
లాస్వాదింపుచుఁ గృతకశైలమ్ము లెక్కుచు నికుంజగృహ
ములం బ్రవేశింపుచు గిరినిర్ఝరమ్ములఁ దోఁగుచు సరోవర
మ్ములఁ గ్రుంకుచుఁ దాపసాశ్రమములు గనుంగొనుచుఁ
బుండరీకవేదండగండకభల్లూకవరాహాదిభీషణమృగముల
ఖండింపుచు ని ట్లనేకవిధముల వనవిహారములు సలుపుచు
నొక్కయెడ శీతలతరుచ్ఛాయాతలమున విశ్రమించి
యున్న సమయంబున.

267

కృత్రిమదంపతీకథనము

తే.

ఓమహాబల రాజేంద్ర యురుగుణాఢ్య
మమ్ము రక్షింపు రక్షింపు సమ్మతముగ
వాడికోఱలబెబ్బులి వచ్చె వచ్చె
ననుచు నాక్రందన మొనర్చె నాద్విజుండు.

268


చ.

నరవరుఁ డంత నెమ్మనమునందుఁ గృపారస ముప్పతిల్లఁగా
శరము శరాసనంబునను సంధిలఁజేసిన యంతలోన నో
హర పరమాత్మ శూలధర హా శివశంకర యంచు నేడ్చుభూ
సురసతిఁ బట్టె బెబ్బులియు సుస్థిరభీషణరోష మేర్పడన్.

269


క.

అంతట శార్దూలముపై
నెంతయు నిశితాస్త్రతతు లనేకంబులు భూ
కాంతుఁడు పరపిన నది యా
వంతయుఁ జలియింపదయ్యె నద్రివిధమునన్.

270


తే.

ఈవిధంబున నేయ నాభూవరేంద్రు
బాణములు లెక్కగొనక దోర్బలము మెఱయ