పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/265

ఈ పుట ఆమోదించబడ్డది

258

బ్రహ్మోత్తరఖండము


సీ.

మంజులపల్లవమంజరీపుంజంబుఁ
        గనుఁగొన నేత్రరంజనము గాఁగ
శారికాకలకంఠకీరకోలాహలం
        బేప్రొద్దు వీనుల కింపు గాఁగఁ
జంపకాదికగంధసంపత్తి యశ్రాంత
        మిష్టమై ఘ్రాణసంతుష్టి యొసఁగ
శైత్యమాంద్యానంతసౌరభ్యమిళితమై
        కరువలి తనుసౌఖ్యకారి గాఁగ


తే.

మేదురమరందఫలరసాస్వాదనంబు
మెరసి జిహ్వకు సంప్రీతికరము గాఁగఁ
బరఁగి పంచేంద్రియాహ్లాదపరతఁ దనరె
నీవనంబులఁ జూడు మిందీవరాక్షి.

264


చ.

తరువులు గోగణంబులు నదంబులు సత్పురుషుల్ ధరిత్రలో
నరయ పరోపకారపరులై జనియించినవారు వీరిలోఁ
దరువులు సారపుణ్యఫలదంబులు సర్వజనశ్రమచ్ఛిదా
కరములు నిత్యసౌఖ్యజనకంబులు గన్గొను మంబుజాననా.

265


మ.

ఘనకర్పూరపరాగసైకతములున్ గస్తూరికామోదముల్
వనదంతావళకుంభనిర్గళితభాస్వన్మౌక్తికంబు ల్విట
ప్యనిశస్రస్తమరందవర్షములు నీహారాంబుపూరంబులున్
గనుఁగొంటే మదహంసయాన విలసత్కాంతారమార్గంబులన్.

266


వ.

అని యివ్విధంబునఁ బ్రశంసింపుచు నుపవనలక్ష్మీసందర్శన
కుతూహలుం డయి సపరివారుండై నిజకుటుంబినీసహిత
ముగాఁ జని యమ్మహీనాథుండు కాంతారమ్ములం దిరుగుచు
సహకారపనసకదళిఖర్జూరద్రాక్షాదిఫలంబు లార